టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ మరియు వినోదాత్మక చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటుంది. వరుస విజయాలతో మంచి జోష్లో ఉన్న శర్వానంద్, ఈ సారి శ్రీను వైట్ల దర్శకత్వంలో ఒక ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ చేయడానికి సిద్ధమయ్యారు. ‘జార్జ్ క్రిష్’ అనే టైటిల్తో ప్రచారంలో ఉన్న ఈ చిత్రం ద్వారా శ్రీను వైట్ల మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వినోదంతో గ్రాండ్ కమ్బ్యాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్కు సంబంధించి ఫిల్మ్నగర్ వర్గాల్లో ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో శర్వానంద్ ఒక సరికొత్త గెటప్లో కనిపించనున్నట్లు సమాచారం. కథానాయికగా యంగ్ అండ్ గ్లామరస్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. శర్వానంద్-భాగ్యశ్రీల తాజా కాంబినేషన్ ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుతోంది. ఇక ఈ చిత్రంలో మరో కీలక పాత్ర కోసం సీనియర్ బాలీవుడ్ నటి రవీనా టాండన్ను సంప్రదిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆమె ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని, ఇది సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం. శ్రీను వైట్ల మార్క్ కామెడీ, ఎమోషన్స్తో పాటు పవర్ ప్యాక్డ్ క్యారెక్టర్లు తోడవడంతో ఈ గ్లోబల్ టచ్ ఉన్న ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

