మొన్న కొడుకు, నేడు భర్త… తీవ్ర దుఃఖంలో సీనియర్ నటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి ఇంట్లో కరోనా కల్లోలం సృష్టించింది. కరోనాతో మొన్న కొడుకును, ఈరోజు భర్తను పోగొట్టుకుని తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది సీనియర్ నటి కవిత. జూన్ 15న కోవిడ్ -19 సమస్యల కారణంగా ఆమె తన కొడుకును కోల్పోయారు. ఆమె కుమారుడు సంజయ్ రూప్ కు కొన్నిరోజుల క్రితం కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతను ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నాడు. అయితే అతని ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుండడంతో ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్ లోనే అతను తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది. ఇక కవిత భర్త దశరథ రాజ్ కూడా కోవిడ్ -19 బారిన పడి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చాలా రోజులు కరోనాతో పోరాడిన ఆయన ఈ రోజు కన్నుమూసినట్టు సమాచారం.
Read Also : తీవ్ర విషాదంలో ‘సాహో’ నటి
Also Read
- NANI : నాని ఫ్యాన్స్కు నిరాశ.. 'బ్లడీ రోమియో' వాయిదా.. 'OG 2'పై సుజీత్ ఫోకస్
- Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
- kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
- NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
ఇక పలు తెలుగు, తమిళ చిత్రాల్లో సహాయక పాత్రల్లో నటించిన కవిత ప్రస్తుతం “ఎండ్రాండ్రం పున్నగై “అనే టీవీ షోలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. 11 ఏళ్ల వయసులో సినిమా పరిశ్రమలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగు పెట్టింది. ఆ తరువాత దాదాపు 350 చిత్రాల్లో నటించారు కవిత. ఇప్పుడు ఈ సీనియర్ నటి చాలా తక్కువ కాలం గ్యాప్ లో కొడుకుని, భర్తను కోల్పోవడం విషాదకరం. దశరథ్ మరణించారన్న వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.
తాజావార్తలు
-
Love Marraige: ప్రేమంటే ఇదే.. మాజీ ఖైదీని పెళ్లాడిన మహిళా జైలర్..
-
Tamil Nadu: లెఫ్ట్ పార్టీల మద్దతు కోరిన విజయ్.. రేపు చెబుతామన్న వామపక్షాలు
-
Huzurabad Clash : హుజూరాబాద్లో పొలిటికల్ వార్.. కౌశిక్ రెడ్డి వర్సెస్ బీజేపీ శ్రేణులు..!
-
Tamil Nadu: రేపు లోక్భవన్ ఎదుట ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు
-
Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఎలా.? వచ్చే 2 రోజులు బెంగాల్ను ఎవరు పాలిస్తారు.?