యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య లక్కీ ఛార్మ్ సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది. ఈ సినిమాతో నాగ చైతన్య సాలీడ్ హిట్ అందుకుని టైర్ 1 లిస్ట్ లో జాయిన్ అవుతాడని ఆశిస్తున్నారు.
Also Read : Masthan Sai : మస్తాన్ సాయి కేస్ లో ఎంట్రీ ఇచ్చిన నార్కోటిక్స్ పోలీసులు
తండేల్ రిలీజ్ సందర్భంగా నాగ చైతన్య సతీమణి శోభితా అక్కినేని పెట్టిన ఇన్స్టా స్టోరీసోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తండేల్ పోస్టర్ షేర్ చేసిన శోభితా తండేల్ సినిమా రిలీజ్పై సంతోషం వ్యక్తం చేస్తూ తాను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సినిమా మేకింగ్ టైమ్ లో నువ్వు ఎంత ఫోకస్ గా పని చేసావో చూసాను.ఈ సినిమా పట్ల పాజిటివ్గా ఉండటం నేను చూశాను. ఈ అద్భుతమైన ప్రేమకథని అందరితోపాటు థియేటర్లో చూసేందుకు నేను కూడా చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ‘ఫైనల్లీ గడ్డం షేవ్ చేస్తావు మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ’’ అని పోస్ట్ చేసింది శోభిత. దీనిపై నాగ చైతన్య స్పందిస్తూ.. ‘‘థాంక్యూ బుజ్జితల్లి’’ పేర్కొంటూ పోస్ట్ చేసాడు. నాగ చైతన్య, శోభితల వివాహవేడుక సమయంలో కూడా చైతు ఫుల్ గడ్డంతోనే కనిపించాడు. మొత్తానికి తండేల్ ను ముగించి క్లీన్ షేవ్ లో దర్శనమిస్తున్నందుకు శోభిత దూళిపాళ్ల సంతోషం వ్యక్తం చేస్తూ చేసిన పోస్ట్ నెట్టింటహల్ చల్ చేస్తుంది.