సాయి తేజ్ నెక్స్ట్ మూవీ… అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అక్టోబర్ లో యాక్సిడెంట్ కు గురైన విషయం తెలిసిందే. ఆ తరువాత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. చాలా రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సాయి తేజ్ ఇటీవల మెగా ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆయన పూర్తిగా కోలుకున్నట్లు తెలిసింది. అయితే తాజాగా ఓ డైరెక్టర్ సాయి ధరమ్ తేజ్ హెల్త్ అప్డేట్ తో పాటు ఆయన నెక్స్ట్ సినిమా గురించి కూడా వెల్లడించారు. డైరెక్టర్ మారుతీ ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి తేజ్ ను తాను కలిశానని, ఆయన ఆరోగ్యం ఇంతకుముందు కన్నా మెరుగ్గా ఉందని, ప్రస్తుతం హుషారుగా ఉన్నారని వెల్లడించారు. అంతేకాదు త్వరలోనే తామిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతోందని, స్క్రిప్ట్ కూడా సిద్ధంగా ఉందని వెల్లడించారు. కాగా మారుతీ దర్శకత్వంలో రూపొందిన “మంచి రోజులొచ్చాయి” చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి స్పందనే వచ్చింది. ఇప్పుడు గోపీచంద్, రాశి ఖన్నా జంటగా ‘పక్కా కమర్షియల్’ సినిమాను రూపొందిస్తున్నారు మారుతీ.
Also Read
- PEDDI North America Bookings : పెద్ది ఓవర్సీస్.. నార్త్ అమెరికా బుకింగ్స్ ఓపెన్.. 30 నిమిషాల్లో ఊచకోత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా..హాలీవుడ్ ‘రీసెట్’ మూవీ క్రేజీ అప్డేట్!
- Purusha : సమ్మర్ రేసులో 'పురుష:'.. మే 22న థియేటర్లలోకి!
- NANI : నాని ఫ్యాన్స్కు నిరాశ.. 'బ్లడీ రోమియో' వాయిదా.. 'OG 2'పై సుజీత్ ఫోకస్
తాజావార్తలు
-
PEDDI North America Bookings : పెద్ది ఓవర్సీస్.. నార్త్ అమెరికా బుకింగ్స్ ఓపెన్.. 30 నిమిషాల్లో ఊచకోత
-
Nashik Forced Conversion: బలవంతపు మతమార్పిడి, లైంగిక వేధింపుల ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ అరెస్టు
-
Virat Kohli Record: విరాట్ కోహ్లీ చెత్త రికార్డు.. ఇదే మొదటిసారి!
-
DMK vs AIADMK: డీఎంకె-ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. మూకుమ్మడిగా రాజీనామా చేస్తాం.. విజయ్ ఎమ్మెల్యేల హెచ్చరిక
-
LSG Record: లక్నోలో ఎన్నాళ్లకు.. ఎల్ఎస్జీకి మొదటి విజయం, ఆర్సీబీకి తొలి ఓటమి!