ఏపీ హైకోర్టులో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పిటిషన్ దాఖలు చేశారు. తనకు ఇచ్చిన సీఐడీ నోటీసులపై స్టే ఇవ్వాలని పిటిషన్ లో కోరాడు రామ్ గోపాల్ వర్మ. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో సీఐడీకి ఫిర్యాదులు అందాయి. దానికి తోడు విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమాను చిత్రీకరించారని వర్మపై గతంలోనే ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో విచారణకు హాజరు కావాలని వర్మకి సీఐడీ నోటీసులు జారీ చేసింది.
OG : గ్యాంగ్ స్టర్ పవన్.. టెన్షన్ లో ఫాన్స్!
దీంతో సీఐడీ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాడు ఆర్జీవీ. రేపు విచారణకు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇప్పటికే వ్యూహం సినిమాకు సంబంధించి ఇప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కించపరిచేలా సినిమా తీసాడని ఆర్జీవీపై కేసు నమోదు అవగా ఒంగోలులో విచారణకి హాజరయ్యాడు ఆర్జీవీ. ఇప్పుడు సీఐడీ అధికారుల నోటీసులు నేపథ్యంలో విచారణకు మినహాయింపు కోరుతూ హైకోర్టును ఆశ్రయించాడు రామ్ గోపాల్ వర్మ.