Peddi: దత్తాత్రేయ స్వామి గుడిలో కూర్చుని పెద్ది కథ రాశా.. ‘పెద్ది’ సీక్రెట్స్ చెప్పిన బుచ్చిబాబు!

Peddi Ramcharan , Buchi Babu

Peddi Ramcharan , Buchi Babu

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘PEDDI’ (పెద్ది). ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచి మెగా అభిమానులతో పాటు సగటు సినిమా ప్రేమికులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా కథకు సంబంధించిన కొన్ని సంచలన, ఆసక్తికరమైన విషయాలను దర్శకుడు బుచ్చిబాబు సానా మొదటిసారి బయటపెట్టారు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బుచ్చిబాబు ఈ సినిమా స్క్రిప్ట్ వెనుక ఉన్న జర్నీని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..”మొదట ఈ సినిమా ఒక చిన్న లైన్ (ఐడియా) లాగా మాత్రమే స్టార్ట్ అయింది. ఆ పాయింట్‌ను మా గురువుగారు సుకుమార్ గారికి చెప్పా.. ఆయనకు విపరీతంగా నచ్చేసి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుకుమార్ గారి ఆమోదం లభించిన తర్వాత, నేను పిఠాపురంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్లాను. అక్కడ గుడి ప్రాంగణంలోనే కూర్చుని ఈ సినిమాకు సంబంధించిన పూర్తి కథను, స్క్రిప్ట్‌ను రాసుకున్నాను” అని బుచ్చిబాబు చెప్పారు.

చరణ్ గారికి చెప్పేటప్పుడు మార్పులు చేయకూడదని మొక్కుకున్నా!
కథ పూర్తి కాగానే రామ్ చరణ్‌కు వినిపించే సమయంలో ఒక ఆసక్తికరమైన మొక్కు మొక్కుకున్నట్లు బుచ్చిబాబు చెప్పారు. “నేను గుడిలో రాసుకున్న కథను చరణ్ గారికి చెప్పేటప్పుడు.. స్క్రిప్ట్‌లో ఒక్క మార్పు కూడా చేయకూడదు, ఆయనకు కథ సింగిల్ సిట్టింగ్‌లోనే నచ్చాలి అని దేవుడిని మొక్కుకున్నా. నా అదృష్టం కొద్దీ చరణ్ గారికి కథ అద్భుతంగా నచ్చింది. నేను ఎలాగైతే అనుకున్నానో, ఎలాంటి మార్పులు లేకుండా ఆయన ఈ కథను అలాగే అంగీకరించారు” అని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. ‘పెద్ది’ చిత్రంపై మెగా అభిమానుల్లో అంచనాలు స్కై హైకి చేరాయి. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.