NTV Telugu Site icon

Pongal 2025 : రవితేజ సినిమాను సంక్రాంతి రేస్ నుండి తప్పించిందెవరు..?

Rt75

Rt75

మాస్ మహారాజ ర‌వితేజ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల మిస్టర్ బచ్చన్ తో పలకరించిన రవితేజ ఆ సినిమా రిలీజ్ సమయంలోనే మరో సినిమాను పట్టాలెక్కించాడు. భాను బోగ‌వ‌రపు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్స్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, సాయి సౌజ‌న్య నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్ లో 75వ సినిమాగా రానుంది ఈ సినిమా. రవితేజ సరసన యంగ్ బ్యూటి శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Also Read : Devara : కసి తీర్చుకున్నకొరటాల.. సక్సెస్ మీట్ లో సెన్సేషనల్ కామెంట్స్

రవితేజ, శ్రీలీల నటిస్తున్న ఈ సినిమాకు “కోహినూర్” అనే టైటిల్పరిశీలనలో ఉంది. తెలంగాణ నేప‌థ్యంలో సాగే కథాంశంతో ఈ సినిమా తెర‌కెక్కనున్నట్టు సమాచారం. ల‌క్ష్మ‌ణ్ భేరి అనే పాత్ర‌లో మాస్ మ‌హారాజా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. కాగా సినిమాను 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ఆ మధ్య ప్రకటించారు మేకర్స్. కాని ఇటీవల ఈ చిత్ర షూటింగ్ సమయంలో రవితేజ గాయపడడంతో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు ఈ సినిమాను సంక్రాంతి రేస్ నుండి తప్పించారు మేకర్స్. గాయం వల్ల షూటింగ్ డిలే అవడం కారణం కాగా, మరోటి బాలయ్య, బాబీ సినిమాను సంక్రాంతికి రిలిజ్ చేయాలి. ఈ రెండు రీజన్స్ తో రవితేజ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల బ్రేక్ ఇచ్చిన RT75 షూట్ అక్టోబర్ 14 నుండి మరో షెడ్యుల్ మొదలు కానుంది. షోల్డర్ సర్జరీ తర్వాత రెస్ట్ తీసుకుంటున్న మాస్ రాజా షూట్ లో జాయిన్ అవుతారు.  భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు.