కింగ్ నాగార్జున, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో హై రేంజ్ యాక్షన్ థ్రిల్లర్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర ఎల్ఎల్పి, నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోవాలో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ ఈ నెల 4 నుంచి హైదరాబాద్లో ప్రారంభం కానుంది.
ఇండియాలోని ప్రధాన నగరాలతో పాటు విదేశాల్లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించేలా దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో నాగార్జున ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ప్యాక్డ్ రోల్లో కనిపించనున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. గుల్ పనాంగ్, అనైకా సురేంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముకేశ్ .జి సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి బ్రహ్మ కడలి ఆర్ట్, రాబిన్ సుబ్బు, నభా మాస్టర్ యాక్షన్ డైరెక్టర్స్గా వర్క్ చేస్తున్నారు.
