టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్స్కు కేరాఫ్ అడ్రస్గా నిలిచే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వెండితెరపైనే కాకుండా డిజిటల్ ప్లాట్ఫామ్పై కూడా తనదైన ముద్ర వేయడానికి మెగాస్టార్ సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఆయన తన జీవిత విశేషాలను పంచుకోవడానికి ‘మెగా పోడ్కాస్ట్’ (Mega Podcast) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రముఖ రచయిత, దర్శకుడు బి.వి.ఎస్. రవి (BVS Ravi) ఎక్స్క్లూజివ్గా వెల్లడించారు. ప్రముఖ వార్తా సంస్థ ‘ఎన్టీవీ’ (NTV) అందించిన ఈ బ్రేకింగ్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.
ఇటీవలే దర్శకుడు పూరి జగన్నాథ్ ‘పూరి మ్యూజింగ్స్’ పాడ్కాస్ట్ ఆడియోలు నెట్టింట హాట్ టాపిక్గా మారిన తరుణంలో.. ఇప్పుడు టాలీవుడ్ బాస్ చిరంజీవి కూడా పోడ్కాస్ట్ ప్రపంచంలోకి అడుగుపెడుతుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. చిరు 4 దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు, ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్.. అరుదైన అనుభవాలను ఈ పోడ్కాస్ట్ ద్వారా అభిమానులతో పంచుకోబోతున్నారు. ఈ క్రేజీ డిజిటల్ ప్రాజెక్ట్ను ప్రముఖ టాలెంటెడ్ రైటర్ బి.వి.ఎస్. రవి నేతృత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటిస్తూ..‘చిరంజీవి అనే వ్యక్తి ఈ తెలుగు చలనచిత్ర పరిశ్రమను, కోట్లాది మంది అభిమానుల హృదయాలను ఎలా రూల్ చేశారు?’ అనే సరికొత్త కోణంలో ఈ పోడ్కాస్ట్ సాగుతుంది. ఇందులో కేవలం సినిమా ముచ్చట్లే కాకుండా.. ఆయన వ్యక్తిగత జీవితంలోని అరుదైన అనుభవాలు, ఇప్పటివరకు ఎక్కడా పంచుకోని ఎన్నో ఆసక్తికరమైన రహస్యాలను మెగాస్టార్ తన స్వరాంతరంతో ప్రేక్షకులకు వివరించబోతున్నారు’ అని బి.వి.ఎస్. రవి స్పష్టం చేశారు.
సాధారణంగా చిరంజీవి మాటల్లో ఎంతో హుందాతనం, క్రమశిక్షణ, స్పూర్తిదాయకమైన విషయాలు ఉంటాయి. ఒక సాదాసీదా మధ్యతరగతి యువకుడిగా కెరీర్ ప్రారంభించి.. ‘మెగాస్టార్’ గా ఎదిగిన ఆయన లైఫ్ జర్నీ ప్రస్తుత జనరేషన్కు ఒక పెద్ద గైడ్లా ఉపయోగపడనుంది. పూరి జగన్నాథ్ తన పాడ్కాస్ట్లలో సమాజంపై బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తే.. చిరంజీవి మాత్రం తన జీవిత పాఠాలను, ఇండస్ట్రీ సీక్రెట్స్ను మోటివేషనల్ అండ్ ఎంటర్టైనింగ్ వే లో అందించబోతున్నారని తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి సంచలన నిర్ణయం.. త్వరలోనే 'మెగా పోడ్కాస్ట్'!
మెగాస్టార్ చిరంజీవి జీవితంలోని అరుదైన అనుభవాలు, ఎవరికీ తెలియని రహస్యాలను పంచుకునేలా సరికొత్త పోడ్కాస్ట్ డిజైన్ చేస్తున్నట్లు ప్రముఖ రచయిత బి.వి.ఎస్. రవి వెల్లడి.
‘చిరంజీవి అనే వ్యక్తి ఈ తెలుగు…
— NTV Breaking News (@NTVJustIn) May 23, 2026
