NTV Telugu Site icon

Allu Shirish: బడ్డీ ప్రీమియర్ షో టాక్ ఎలా ఉంది..నేడు ప్రీమియర్ షో ఎక్కడంటే..?

Untitled Design (16)

Untitled Design (16)

అల్లు శిరీష్ హీరోగా న‌టిస్తున్నతాజా చిత్రం ‘బ‌డ్డీ’. తమిళ దర్శకుడు సామ్ అంటోన్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. గతంలో తమిళ హీరో ఆర్యా నటించిన టెడ్డి చిత్రాన్ని పోలినట్టు ఉందని ఈ చిత్ర టీజర్, ఫస్ట్ లుక్ చుస్తే అర్ధం అవుతుంది. కానీ తాము సరికొత్త కథాంశంతో రాబోతున్నామని తమిళ చిత్రానికి తమ చిత్రానికి కేవలం బొమ్మ మాత్రమే సేమ్, మిగిలినదంతా వేరు అని దర్శకుడు ఇది వరకే తెలిపాడు.

కాగా ఈ చిత్రాన్ని మొదట జులై 26, 2024న విడుదల చేయాలని నిర్ణయించారు నిర్మాతలు. అనివార్య కారణాల వలన రిలీజ్ వాయిదా పడింది. తాజాగా మరో డేట్ ను ప్రకటించారు మేకర్స్.  ఆగస్ట్ 2, 2024 వరల్డ్ వైడ్ గా బడ్డీ చిత్రాన్ని  విడుదల చేస్తున్నట్టు పోస్టర్ ను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసారు హీరో అల్లు శిరీష్.

మరోవైపు బడ్డీ చిత్రాన్ని విడుదలకు ముందుగా ప్రముఖ సెంటర్లలో ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగా నిన్న విజయవాడలోని రాజ్ యువరాజ్ థియేటర్ లో స్పెషల్ షోకు హీరో అల్లు శిరీష్ తో పాటు యూనిట్ హాజరయ్యారు. బడ్డీ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేసాడు శిరీష్ . ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారని శిరీష్ తెలిపాడు.  స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్  బడ్డీని నిర్మిస్తోంది. ఈ మూవీలో గాయత్రీ భరద్వాజ్, అజ్మల్ అమీర్, ప్రిషా సింగ్, ముఖేష్ రిషి, మహమ్మద్ అలీ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. హిప్‌హాప్ తమిజా సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. నేడు విశాఖపట్నంలోని శ్రీకన్య థియేటర్లో 2గంటలకు ప్రీమియర్ షోకు యూనిట్ హాజరుకానున్నారు.