NTV Telugu Site icon

Manishi Nenu: మనిషి నేను అంటున్న లోవరాజు!

Manishinenu

Manishinenu

‘Manishi Nenu’ song from Bandi Saroj Kumar’s new movie ‘Parakramam’ is out: బిఎస్కె మెయిన్ స్ట్రీమ్ బ్యానర్ పై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా “పరాక్రమం”. శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టులో గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అయితే బండి సరోజ్ కుమార్ స్వరపరిచిన ‘మనిషి నేను’ అనే లిరికల్ వీడియో పాటను సోషల్ మీడియా లో విడుదల చేసారు.

Kalki 2898 AD: ఫేక్ కలెక్షన్స్ .. ఇద్దరు ట్రేడ్ అనలిస్టులకు లీగల్ నోటీసులు!

హైమత్ మహమ్మద్ ఈ పాటకి తన గాత్రం అందించారు. ఈ సందర్భంగా బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ “పరాక్రమం చిత్రం నుంచి నేను రాసి స్వరపరిచిన ‘మనిషి నేను’ అనే పాటను సోషల్ మీడియాలో విడుదల చేసా, ఈ పాటని హైమత్ మహమ్మద్ పాడారు. నా పాట అందరికి నచ్చుతుంది అని భావిస్తున్నా. మా చిత్రాన్ని ఆగష్టు లో విడుదల చేస్తున్నాం, త్వరలోనే ట్రైలర్ తో మీ ముందుకు వస్తాం” అని తెలిపారు ఈ సినిమాకి కథ, కథనం, మాటలు,ఎడిటర్, సంగీతం, లిరిక్స్, నిర్మాత, దర్శకుడు – బండి సరోజ్ కుమార్ అందిస్తుండగా సినిమాటోగ్రఫీ – వెంకట్ ఆర్ ప్రసాద్, సౌండ్ డిజైన్ మరియు మిక్సింగ్ : కాళీ ఎస్ ఆర్ అశోక్ అందిస్తున్నారు.