NTV Telugu Site icon

Manchu Breaking : కేసుల వ్యవహారంపై స్పందించిన మంచు ఫ్యామిలీ

Manchufamily

Manchufamily

మంచు కుటుంబంలోని ఆస్తుల వ్యవహారం రచ్చకెక్కింది. గతంలో మాటల యుద్ధం కొనసాగించిన మంచు బ్రదర్స్ ఇటివల సైలెంట్ గా ఉన్నారు. కానీ నేడు మరోసారి మంచు కుటుంబంలోని ఆస్తుల వ్యవహారం వివాదానికి దారితీసింది.  మోహన్ బాబు తనన, తన భార్యని కొట్టాడని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు మంచు మనోజ్. అయితే  మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై ఫిర్యాదు చేశాడు మోహన్ బాబు. తండ్రి కొడుకులు ఒకరిమీద ఒకరు కేసులు పెటుకున్నారు అనే వార్త టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Also Read : Braking News : మోహన్ బాబుపై చిన్న కొడుకు మంచు మనోజ్ ఫిర్యాదు

స్కూల్, ఆస్తుల వ్యవహారంలో గత కొద్దీ రోజులుగా వీరి మధ్య వివాదం నడుస్తుండగా ఇప్పుడు పరస్పర దాడులు వరకు వెళ్ళింది.ఈ వ్యవరంపై మంచు మోహన్ బాబుకు చెందిన పిఆర్ టీమ్ స్పందించింది. మోహన్ బాబు గారు మంచుమనోజ్ పరస్పర ఫిర్యాదులు చెసుకున్నారనే వార్తల్లో అసలు నిజం‌ లేదు. మంచు మనోజ్ దెబ్బలతో వచ్చి మరీ పొలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నట్లు ఊహాజనితమైన కధనాలను కొన్ని మీడియా చానెల్స్ ప్రసారం చేస్తున్నాయి. ఎవిడెన్స్ లు లేకుండా అసత్య ప్రచారాలను చేయకండి అని ప్రకటన విడుదల చేశారు. మరి ఈ  కేసులో వాస్తవాలు ఏమిటనేది తెలియాల్సి ఉంది.