Gauri Krishna: చంపేస్తామంటున్నారు.. పోలీసులకు పొలిమేర నిర్మాత ఫిర్యాదు
- చంపేస్తానని బెదిరిస్తున్నట్లు పోలీసులకు టాలీవుడ్ నిర్మాత గౌరీ కృష్ణ ఫిర్యాదు
- నందిపాటి వంశీ
- సుబ్బారెడ్డి బెదిరిస్తున్నారు అంటూ గౌరీ కృష్ణ ఫిర్యాదు
- తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించాల్సిందిగా కోరుతూ పోలీసులకు ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maa Oori Polimera 2 Producer Gauri Krishna files Complaint on Vamshi Nandipati: టాలీవుడ్ నిర్మాత గౌరీ కృష్ణ తనను మరో నిర్మాత చంపేస్తానని బెదిరిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా ఊరి పొలిమేర 2 సినిమాతో నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న గౌరీ కృష్ణ. ఈ సినిమాని గత ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా అది సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఆ సినిమాకి సంబంధించి తనకు రావాల్సిన షేర్ ఇవ్వకుండా అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారు అంటూ మరో టాలీవుడ్ నిర్మాత మీద గౌరీ కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ ఉదయం ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన ఫిర్యాదు మేరకు తాను మా ఊరి పొలిమేర 2 అనే సినిమా నిర్మాతనని ఆ సినిమా నిర్మించిన తర్వాత సినిమాని వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తామని హక్కులు తమకు ఇవ్వాల్సిందిగా నందిపాటి వంశీ, సుబ్బారెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు తనను అప్రోచ్ అయ్యారని చెప్పుకొచ్చారు.
Rakul Preet Brother: షాకింగ్: డ్రగ్స్ కేసులో రకుల్ తమ్ముడు అరెస్ట్
Also Read
- Spirit: 'స్పిరిట్'లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
- Varanasi Movie Update: 'వారణాసి'కి రాజమౌళి డెడ్లైన్.. పక్కా ప్లాన్ ప్రకారమే!
- Bethlehem Kudumba Unit : 2026 ఓనమ్ విన్నర్గా నివిన్ పౌలి.. 'బెత్లేహెమ్ కుటుంబ యూనిట్' బ్లాక్ బస్టర్
- Prabhas Fauji: ‘ఫౌజీ’లో అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్.. పీక్స్కు చేరిన హైప్.. బాక్సాఫీస్ తగలబడిపోద్ది ఇగ!
తనకు కూడా వారి అగ్రిమెంట్ నచ్చడంతో వారికి సినిమా రైట్స్ రాసిచ్చానని గౌరీ కృష్ణ వెల్లడించారు. అయితే సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచిన తర్వాత దాదాపు 30 కోట్ల రూపాయలు కలెక్షన్లు రాబట్టినట్టు తెలుగులో లీడింగ్ న్యూస్ పేపర్లతో పాటు మీడియా కూడా కవర్ చేసిందని ఈ నేపథ్యంలో తనకు రావలసిన షేర్ ని అడిగితే ముందు కొన్నాళ్ల పాటు కాలం గడుపుతూ వచ్చిన వంశీ నందిపాటి తరువాత ఆ విషయాన్ని పట్టించుకోవడం మానేశాడని చెప్పుకొచ్చారు. తాను వాళ్ళ ఆఫీస్ కి వెళ్లి అడిగితే డబ్బులు ఇచ్చేది లేదని ఇంకా గట్టిగా మాట్లాడితే చంపేస్తామని బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏదైనా ఆఫీసులకు వెళ్లినా, సంఘాలకు వెళ్లి ఫిర్యాదు చేస్తే ప్రాణాలు దక్కవని కూడా హెచ్చరించినట్లు వెల్లడించారు. తనకు ప్రాణ భయంతో పాటు తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించాల్సిందిగా కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు గౌరీ కృష్ణ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Spirit: ‘స్పిరిట్’లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
-
TGSRTC Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ.. టికెట్ బుకింగ్స్పై భారీ డిస్కౌంట్ ప్రకటన..
-
Varanasi Movie Update: ‘వారణాసి’కి రాజమౌళి డెడ్లైన్.. పక్కా ప్లాన్ ప్రకారమే!
-
Rahul Gandhi: ఢిల్లీ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ గాంధీ ధర్నా.. పెల్లెట్ గన్ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
ట్రెండింగ్
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!