Gauri Krishna: చంపేస్తామంటున్నారు.. పోలీసులకు పొలిమేర నిర్మాత ఫిర్యాదు
- చంపేస్తానని బెదిరిస్తున్నట్లు పోలీసులకు టాలీవుడ్ నిర్మాత గౌరీ కృష్ణ ఫిర్యాదు
- నందిపాటి వంశీ
- సుబ్బారెడ్డి బెదిరిస్తున్నారు అంటూ గౌరీ కృష్ణ ఫిర్యాదు
- తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించాల్సిందిగా కోరుతూ పోలీసులకు ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maa Oori Polimera 2 Producer Gauri Krishna files Complaint on Vamshi Nandipati: టాలీవుడ్ నిర్మాత గౌరీ కృష్ణ తనను మరో నిర్మాత చంపేస్తానని బెదిరిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా ఊరి పొలిమేర 2 సినిమాతో నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న గౌరీ కృష్ణ. ఈ సినిమాని గత ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా అది సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఆ సినిమాకి సంబంధించి తనకు రావాల్సిన షేర్ ఇవ్వకుండా అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారు అంటూ మరో టాలీవుడ్ నిర్మాత మీద గౌరీ కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ ఉదయం ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన ఫిర్యాదు మేరకు తాను మా ఊరి పొలిమేర 2 అనే సినిమా నిర్మాతనని ఆ సినిమా నిర్మించిన తర్వాత సినిమాని వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తామని హక్కులు తమకు ఇవ్వాల్సిందిగా నందిపాటి వంశీ, సుబ్బారెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు తనను అప్రోచ్ అయ్యారని చెప్పుకొచ్చారు.
Rakul Preet Brother: షాకింగ్: డ్రగ్స్ కేసులో రకుల్ తమ్ముడు అరెస్ట్
Also Read
- PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
- Money Heist: 'మనీ హెయిస్ట్' ఫ్యాన్స్కు నెట్ఫ్లిక్స్ సర్ప్రైజ్.. ప్రొఫెసర్ ప్రయాణం ఇంకా ముగియలేదు!
- CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. 'జన నాయగన్' సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
- Peddi : బుకింగ్స్ ఓపెన్ చేసిన గ్లోబల్ స్టార్..అమెరికాలో ‘పెద్ది’ సందడి.. టికెట్ రేట్లు ఇవే!
తనకు కూడా వారి అగ్రిమెంట్ నచ్చడంతో వారికి సినిమా రైట్స్ రాసిచ్చానని గౌరీ కృష్ణ వెల్లడించారు. అయితే సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచిన తర్వాత దాదాపు 30 కోట్ల రూపాయలు కలెక్షన్లు రాబట్టినట్టు తెలుగులో లీడింగ్ న్యూస్ పేపర్లతో పాటు మీడియా కూడా కవర్ చేసిందని ఈ నేపథ్యంలో తనకు రావలసిన షేర్ ని అడిగితే ముందు కొన్నాళ్ల పాటు కాలం గడుపుతూ వచ్చిన వంశీ నందిపాటి తరువాత ఆ విషయాన్ని పట్టించుకోవడం మానేశాడని చెప్పుకొచ్చారు. తాను వాళ్ళ ఆఫీస్ కి వెళ్లి అడిగితే డబ్బులు ఇచ్చేది లేదని ఇంకా గట్టిగా మాట్లాడితే చంపేస్తామని బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏదైనా ఆఫీసులకు వెళ్లినా, సంఘాలకు వెళ్లి ఫిర్యాదు చేస్తే ప్రాణాలు దక్కవని కూడా హెచ్చరించినట్లు వెల్లడించారు. తనకు ప్రాణ భయంతో పాటు తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించాల్సిందిగా కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు గౌరీ కృష్ణ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?