LGBT 2: సెకండ్ పార్ట్ అనౌన్స్.. ఆ దర్శకుడిపై ఎల్.బి. శ్రీరామ్ షాకింగ్ కామెంట్స్!

Lgbt

Lgbt

ట్రాన్స్‌జండర్ వ్యక్తుల జీవితాలు, వారి ఆత్మగౌరవ పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన సంచలనాత్మక చిత్రం “ఎల్‌జిబిటి – ఏ లీగల్ బ్యాటిల్” ప్రశంసలు అందుకుంటోంది. శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్ పై సుభాష్ చక్రవర్తి రవడ సహ నిర్మాతగా ట్రాన్స్‌జండర్ వ్యక్తుల జీవితాల మీద తీసిన కోర్ట్ రూమ్ డ్రామా “ ఎల్ జి బీ టీ – ఏ లీగల్ బ్యాటిల్ “ ఈ నెల 19th న దేశవ్యాప్తంగా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది, ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ ఈ చిత్ర బృందాన్ని అభినందిస్తూ … ఫిలిం ఛాంబర్‌లో మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలతో పాటు చిత్రబృందాన్ని ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రేక్షకులు ఈ చిత్రానికి అందించిన ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. పలు విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వాలని కోరుతున్నారని, ఈ ఆదరణతో 2027లో ‘ఎల్‌జిబిటి’ రెండవ భాగాన్ని 2027లో చేయడానికి సన్నాహాలు చేస్తున్నాను అన్నారు.

ఈ చిత్రంలో న్యాయమూర్తి (జడ్జి) పాత్రలో మెరిసిన సీనియర్ నటుడు ఎల్.బి. శ్రీరామ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఇంత గొప్ప దర్శకుడిని ఇంత ఆలస్యంగా గుర్తించడానికి నాకు అవమానంగా ఉంది. అసలు టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పటివరకు పి. సునీల్ కుమార్ రెడ్డి గారిని ఎందుకు గుర్తించలేదో అర్థం కావడం లేదు. ఆయన ఎంతో మల్టీ టాలెంటెడ్. తెలుగు సినిమా చరిత్రలో ఇదొక గొప్ప మైలురాయిగా నిలిచిపోతుంది. ఈ సినిమా చూసిన తర్వాత సమాజంలో ట్రాన్స్‌జండర్లపై ఉన్న అభిప్రాయాలు మారుతాయి.” అని అన్నారు.