NTV Telugu Site icon

Laapataa Ladies: సుప్రీం కోర్టులో అమిర్‌ఖాన్‌ ‘లాపతా లేడీస్’.. కారణం ఏంటంటే..?

Untitled Design 2024 08 09t111506.012

Untitled Design 2024 08 09t111506.012

సుప్రీంకోర్టు 75వ వార్షికోత్సవం సందర్భంగా బాలీవుడ్‌ చిత్రం ‘లాపతా లేడీస్‌’ ను నేడు సుప్రీంకోర్టులో ప్రదర్శించనున్నారు. లింగ సున్నితత్వ శిక్షణ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమాను ప్రదర్శించబోతున్నారు. ఈ ప్రదర్శనకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ సహా న్యాయమూర్తులు, వారి కుటుంబసభ్యులు, ఇతర రిజిస్ట్రీ అధికారులు చూడనున్నారు. ఈ స్క్రీనింగ్ సమయంలో దర్శకుడు కిరణ్‌రావు , నిర్మాత అమీర్ ఖాన్ కూడా హాజరుకానున్నారు. ఈ శుక్రవారం సాయంత్రం 4.15 గంటల నుంచి 6.20 గంటల వరకు అడ్మినిస్ట్రేటివ్‌ భవనంలోని సి-బ్లాక్‌ ఆడిటోరియంలో ‘లాపతా లేడీస్‌’ స్పెషల్ షో వేయనున్నారు. ఈ సినిమాను అమిర్ ఖాన్ నిర్మించగా ఆయన మాజీ భార్య కిరణ్‌రావ్ దర్శకత్వం వహించింది.

Also Read : NTRNeel : బాక్సాఫీస్ విధ్వంసానికి పూజ మొదలెట్టిన తారక్ – నీల్

2001లో గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువ వధువులు రైలు ప్రయాణంలో తప్పిపోయిన సంఘటన ఆధారంగా కథాంశాన్ని ఎంచుకుని, లింగ సమానత్వాన్ని, చాటి చెప్పే కామెడీ డ్రామా ఫిల్మ్‌ గా తెరకెక్కించారు దర్శకురాలు కిరణ్ రావ్. ఈ ఏడాది మార్చి లో వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదలై ఈ సినిమా మిశ్రమ స్పందన రాబట్టింది. కానీ ఆశించిన మేర కలెక్షన్స్ అయితే రాబట్టలేదు. కొన్ని వారాల తర్వాత నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో లాపతా లేడీస్‌ స్ట్రీమింగ్ చేయగ అత్యధిక వ్యూస్ రాబట్టి టాప్ -1 లో కొనసాగి అద్భుత  స్పందన రాబట్టింది. మరోవైపు ఈ సినిమాను రిలీజ్ కు ముందుగానే గతేడాది సెప్టెంబరు 8న ప్రతిష్ఠాత్మక టోరంటో ఇంటర్‌నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (టీఐఎఫ్‌ఎఫ్‌) వేడుకలో ప్రదర్శించారు. టీఐఎఫ్‌ఎఫ్‌ కమిటీ సభ్యుల నుండి ప్రశంసలు దక్కించుకుంది లాపతా లేడీస్‌.