‘శుక్ర’, ‘మాటరాని మౌనమిది’, ‘ఏ మాస్టర్ పీస్’ వంటి విభిన్న చిత్రాలతో సినీ ప్రేమికులను ఆకట్టుకున్న దర్శకుడు పూర్వాజ్, ఇప్పుడు సరికొత్త సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ **‘కిల్లర్’**తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో పూర్వాజ్ స్వయంగా హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. హీరోయిన్గా జ్యోతి రాయ్ నటిస్తుండగా, విశాల్ రాజ్, దశరథ, చందూ, గౌతమ్ లాంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏయు అండ్ ఐ, మెర్జ్ ఎక్స్ఆర్ సంస్థలతో కలిసి థింక్ సినిమా బ్యానర్పై పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 30, 2025న ‘కిల్లర్’ మూవీ గ్లింప్స్ తెలుగు, కన్నడ భాషల్లో విడుదలైంది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో ఎలిమెంట్స్తో కూడిన ఈ గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. హై-క్వాలిటీ వీఎఫ్ఎక్స్, గ్రిప్పింగ్ విజువల్స్ సినిమా స్థాయిని మరో లెవెల్కి తీసుకెళ్లాయి.
Read More: Kingdom: ‘హృదయం లోపల’ ఏదోలా ఉందంటున్న దేవరకొండ
“ప్రాచీన వైమానిక శాస్త్రంలో ఆశ్చర్యకరమైన మానవ మేధస్సు రహస్యాలు… ఆత్మ కలిగిన యంత్రాలు నిజమవుతాయా?” అనే ఆకర్షణీయమైన వాయిస్ఓవర్తో గ్లింప్స్ ప్రారంభమవుతుంది. హీరోయిన్ జ్యోతి రాయ్ ‘డీ బౌండ్’ అనే అరుదైన డిజార్డర్తో బాధపడుతూ, దాన్ని జయిస్తే పునర్జన్మ లాంటిదని, అప్పుడు ఆమెను ఎదురించడం ఎవరి తరం కాదని చెప్పే సన్నివేశాలు గూస్బంప్స్ తెప్పిస్తాయి. జ్యోతి రాయ్ సూపర్ షీ క్యారెక్టర్లో చేసిన స్టన్నింగ్ యాక్షన్ సీక్వెన్స్లు, ఆమె సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ గ్లింప్స్లో హైలైట్గా నిలుస్తాయని టీం చెబుతోంది. లవ్, రొమాన్స్, రివేంజ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, థ్రిల్లర్ అంశాల మేళవింపుతో ఈ సినిమా రూపొందినట్లు గ్లింప్స్ హింట్ ఇస్తోంది. చివర్లో హీరోగా, దర్శకుడిగా పూర్వాజ్ చెప్పిన “మొదలెడదామా?” అనే పవర్ఫుల్ డైలాగ్ సినిమాపై ఉత్కంఠను రెట్టింపు చేస్తుంది.