Site icon NTV Telugu

Chiranjeevi Blood Bank: చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేసిన కర్ణాటక ఎమ్మెల్యే

Chirajeevi K Mla

Chirajeevi K Mla

Karnataka MLA Donates Blood at Chiranjeevi Blood Bank: కర్ణాటక MLA ప్రదీప్ ఈశ్వర్ ఈరోజు హైదరాబాద్ లో రక్తదానం చేశారు. కర్ణాటక – చిక్ బళ్ళాపూర్ శాసన సభ్యులు ప్రదీప్ ఈశ్వర్ చిరంజీవి బ్లడ్ బ్యాంకు లో ఈ రోజు రక్తదానం చేశారు. వారితో పాటు బంధువులు రమేష్ బాబు గారు కూడా రక్తదానం చేశారు. మెగాస్టార్ చిరంజీవిని కలవడానికి హైదరాబాదు వచ్చిన ఆయన అంతకంటే ముందు చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్త దానం చేసినట్లు తెలుస్తోంది.

Rekha Boj: ఇంకో జన్మ ఎత్తినా మారరు.. తెలుగు దర్శకనిర్మాతలపై హీరోయిన్ ఫైర్

ఇక అనంతరం మెగాస్టార్ చిరంజీవి నివాసంలో మర్యాద పూర్వకంగా ప్రదీప్ ఈశ్వర్ కలవగా, రక్తదానం చేసినందుకు ప్రత్యేకంగా మెగాస్టార్ చిరంజీవి MLAని అభినందించారు. ఈ మేరకు చిరంజీవి ఐ అండ్ బ్లడ్ సెంటర్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి గత కొంత కాలంగా చికెన్ గున్యాతో బాధ పడుతున్నారు. కొద్దిగా కోలుకున్న ఆయన ఈరోజు నాగబంధం అనే సినిమా ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Exit mobile version