Tollywood : టాలీవుడ్ సినిమాలకు ఏమైంది.. వరుస వాయిదాలు.. కారణం అదేనా..?
టాలీవుడ్ సినిమాలకు ఇప్పుడు రిలీజ్ కష్టాలు మొదలయ్యాయి. చిన్న సినిమా, పెద్ద సినిమా అని ఎలాంటి తేడా లేకుండా వరుసగా వాయిదా పడుతూ వస్తున్నాయి.ఈ పరిస్థితి రావడానికి పలు కారణాలు వున్నాయి.ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది .అలాగే దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి కూడా మొదలైంది.. దీనితో ఇలాంటి పరిస్థితులలో చిత్రాలను విడుదల చేస్తే మొదటికే మోసం వస్తుందని పలు స్టార్ హీరోల సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి..పెద్ద సినిమాలు వాయిదా పడటంతో చిన్న సినిమాలకు లైన్ క్లియర్ అయిందని అంత భావించారు..
కానీ చిన్న సినిమాలకు ఇప్పుడు ఇదే పరిస్థితి ఎదురవుతుంది .అసలే ఓటీటీలు వచ్చాక ప్రేక్షకులు చిన్న సినిమాల కోసం థియేటర్లకి రావడం తగ్గించేశారని అని చిన్న సినిమా ప్రొడ్యూసర్స్ బాధపడుతుంటే.. ఇప్పుడీ వేసవి సీజన్ లో ఐపీఎల్ , సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలవడంతో థియేటర్స్ కు ప్రేక్షకులు వచ్చే పరిస్థితి అస్సలు కనబడటం లేదు .పెద్ద హీరోల సినిమాలు ఎటు వాయిదా పడ్డాయి . ఇప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన చిన్న సినిమాలు కూడా వాయిదా పడుతున్నాయి
Also Read
- Buchi Babu: 'పెద్ది'ని గుండెల్లోంచి తీసేయడం ఎవరికీ సాధ్యం కాదు.. బుచ్చిబాబు
- Sukumar: శిష్యుడిని మెచ్చుకున్న గురువు.. 'పెద్ది' లాంటి కమర్షియల్ ఎమోషనల్ రైడ్ ఈ మధ్య రాలేదు: సుకుమార్
- Peddi: మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. జూన్ 4న 'పెద్ది' రిలీజ్..
- Mythri Sashi: మైత్రీ వర్సెస్ ఎగ్జిబిటర్లు.. సంచలన లేఖ విడుదల చేసిన మైత్రీ శశి!
దిల్ రాజు సోదరుని కుమారుడు ఆశిష్ హీరోగా, ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా వస్తున్న సినిమా “లవ్ మీ “.ఈ సినిమాకు అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు .ఈ సినిమాను శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. కానీ ఐపీఎల్ మరియు ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమాను వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా వాయిదాకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అలాగే హీరో నవదీప్ నటించిన లేటెస్ట్ మూవీ ‘లవ్, మౌళి’. నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి . ఈ చిత్రానికి అవనీంద్ర దర్శకత్వం వహించారు . ఈ సినిమాను ఏప్రిల్ 19న విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. కానీ ఇప్పుడీ సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా నవదీప్ అండ్ టీమ్ అధికారికంగా ప్రకటించింది. కొన్ని కారణాల వల్ల సినిమాను వాయిదా వేసినట్లుగా హీరో నవదీప్ ప్రకటించారు .త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలియజేసారు ..
‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి, కోమలీ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం “శశివదనే” .. సాయి మోహన్ ఉబ్బన ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు . ఈ చిత్రాన్ని ఏప్రిల్ 19న భారీగా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ చిత్రం కూడా వాయిదా పడ నున్నట్లు తెలుస్తుంది .
- Tags
- #post poned
- Movies
- Tollywood
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!