Ilaiyaraaja : నా జీవితంలో ఏం జరగాయో అవన్నీ పాటలుగా వచ్చాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దశాబ్దాలుగా.. భారతీయ సినీ సంగీత ప్రపంచాన్ని తన స్వరాలతో మాయ చేసిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా, ఇటీవల విజయవాడలో జరగబోయే తన లైవ్ కచేరీ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తన సంగీత ప్రయాణం, మారుతున్న కాలం, నేటి సంగీత ధోరణులపై హృదయానికి హత్తుకునే మాటలు చెప్పారు.
Also Read :Prithviraj Sukumaran : లోకల్ పుష్ప అవతారంలో పృథ్వీరాజ్.. ‘విలాయత్ బుద్ధ’పై భారీ క్రేజ్!
Also Read
- Tollywood: పర్సంటేజీ ఇష్యూ.. శిరీష్ రెడ్డికి మైత్రి రవి స్ట్రాంగ్ కౌంటర్
- Maa Inti Bangaram: ఖుషీ అవుతున్న సమంత ఫాన్స్.. ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ అప్పుడే!
- Peddi : ముంబైలో ట్రైలర్ లాంచ్, భోపాల్లో రెహమాన్ లైవ్ కాన్సర్ట్!
- CM Vijay: IMDb లిస్ట్ను షేక్ చేసిన తమిళనాడు సీఎం.. వారంలోనే టాప్-2లోకి 'దళపతి'! అసలేం జరిగిందంటే..
ఇళయరాజా మాట్లాడుతూ..
“నా జీవితంలో జరిగినవన్నీ పాటలే. మాట్లాడటానికి ఇప్పుడు మాటలు లేవు. నా పాటలే మాట్లాడుతున్నాయి. నా పాటల్లో జీవం ఉంది, ఎమోషన్ ఉంది. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో నా పాటలు ఏదో ఒక సందర్భంలో భాగం అయ్యాయి. నా పాటల్లో జీవం ఉంది, ఎమోషన్ ఉంది. అందుకే అవి గుండెల్లోకి, మనసులోకి వెళ్లిపోతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో నా పాటలు ఏదో ఒక సందర్భంలో భాగం అయ్యాయి’ అని భావోద్వేగంగా చెప్పారు.
ఇప్పటి సంగీత ధోరణులపై మాట్లాడుతూ..
“ఇప్పుడు వచ్చే పాటలు ఎందుకు వస్తున్నాయో తెలియడం లేదు. మేల్ సింగర్ పాడినా ఫీమేల్కి తెలియదు, ఫీమేల్ పాడినా మేల్కి తెలియదు. దర్శకుడికే ఏ పాట వస్తుందో తెలియని పరిస్థితి. మా కాలంలో మాత్రం ప్రతి పాట ఒక టీమ్వర్క్ ఫలితం. దాదాపు 80 మంది ఆర్కెస్ట్రాతో ఒకే చోట కూర్చుని పాటలు కంపోజ్ చేసేవాళ్లం. చెప్పాలి అంటే ఆ రోజుల్లో రికార్డింగ్ అంటే పండగలా ఉండేది. ఎవరు ఏ పాట పాడాలో నేను రాసి ఇస్తా. నిర్మాతలు పిలిచి రిహార్సల్స్ చేయించి, కరెక్ట్గా వచ్చినప్పుడు మాత్రమే పాట బయటకి వెళ్తుంది. 60 మంది ఒకే దిశగా కృషి చేస్తే నాలుగు నిమిషాల పాటలో జీవం పుట్టేది. కానీ ఇప్పుడు సంగీతం చేసే వాళ్లు ఒకే లైన్లో ఉండటం లేదు. ఒకరికొకరు కనెక్ట్ అయ్యే ఫీలింగ్ లేకపోవడం వల్ల ఆ పాటలపై ఆసక్తి తగ్గిపోతోంది” అన్నారు.
చివరిగా తన విజయవాడ లైవ్ కచేరీ గురించి మాట్లాడుతూ ..
“విజయవాడలో ఇది నా మొదటి లైవ్ ప్రోగ్రాం. రేపు కచేరీకి వచ్చే వారు నా పాటల్లో ఉన్న ఆ హృదయానుభూతిని, ఆ ఎమోషన్ను ప్రత్యక్షంగా అనుభవిస్తారని నమ్ముతున్నా,” అని ఇళయరాజా తెలిపారు.
తాజావార్తలు
-
Karnataka: కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం.. పాఠశాలల్లో హిజాబ్, జంధ్యాలు ధరించేందుకు అనుమతి
-
Test Rankings: ICC టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల.. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ల విభాగాల్లో దుమ్మురేపిన టీమిండియా..
-
Tollywood: పర్సంటేజీ ఇష్యూ.. శిరీష్ రెడ్డికి మైత్రి రవి స్ట్రాంగ్ కౌంటర్
-
India-Russia: సంక్షోభం వేళ భారత్కు రష్యా భరోసా..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి వార్నింగ్ ఇచ్చిన ఏబీ డివిలియర్స్.. అది అంత ఈజీ కాదంటూ..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!