Harish Shankar: ‘మిస్టర్ బచ్చన్’ నష్టాలు.. హరీష్ కీలక నిర్ణయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Shankar Retunred 2 Crores from Remuneratoins: అప్పుడెప్పుడో మాస్ మహరాజా రవితేజను.. హిందీ మూవీ ‘రైడ్’ని రీమేక్ చేయమంటే.. చేయలేనని చెప్పినట్టుగా మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్లో చెప్పుకొచ్చాడు. కానీ ఈ రీమేక్ హరీష్ శంకర్ చేతికి వెళ్లిన తర్వాత.. తాను సై అన్నానని చెప్పాడు రవితేజ. ఎందుకంటే.. హరీష్ శంకర్ రీమేక్ను రీమేక్లా కాకుండా.. స్ట్రెయిట్ మూవీలా మన నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేయడంలో దిట్ట. గతంలో గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ సినిమాలను.. ఒరిజినల్ సినిమాల కంటే వావ్ అనేలా రీమేక్ చేశాడు. ఆ నమ్మకంతోనే మాస్ రాజా రైడ్ రీమేక్ చేశాడు. అందుకు తగ్గట్టే.. రిలీజ్కు ముందు పాటలు, ప్రమోషన్లతో భారీ హైప్ క్రియేట్ చేశారు. దానికి తోడు మిరపకాయ్ కాంబో మరింత హైప్ ఎక్కించింది. కానీ తీరా థియేటర్లోకి వచ్చాక మిస్టర్ బచ్చన్ రిజల్ట్ తేడా కొట్టేసింది. ఇండిపెండెన్స్ కానుకగా ఆగస్టు 15న రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్ సినిమా.. ఫస్ట్ షో నుంచే నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
Akkineni Family: వరద బాధితులకు అక్కినేని కుటుంబం సాయం ఎంతంటే?
Also Read
- Vijay Sethupathi : నాడు పూరి సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్.. నేడు అదే పూరి దర్శకత్వంలో హీరోగా!
- Peddi :బుచ్చిబాబుపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్!
- Anantha Sriram: "విషం కక్కే రివ్యూల దారిద్యాన్ని దాటి 'పెద్ది' బాక్సాఫీస్ బద్దలుకొట్టింది!
- SlumDog Movie Teaser: 'మా బతుకులతో ఆడుకుంటే వదలం'.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పూరీ 'స్లమ్డాగ్' టీజర్!
దాని ఫలితం.. నిర్మాతలకు కాస్త గట్టిగానే నష్టాలను మిగిల్చింది ఈ చిత్రం. దీంతో.. హరీష్ శంకర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. హరీష్ తన రెమ్యూనరేషన్ నుంచి 2 కోట్ల రూపాయలు వెనక్కి ఇచ్చినట్టుగా సమాచారం. ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్ ప్రకారం.. ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకుడిగా దాదాను 10 కోట్ల పారితోషికం తీసుకున్నట్టుగా చెబుతున్నారు. కానీ సినిమా ఫ్లాప్ అవడంతో.. తిరిగి నిర్మాతలకు 2 కోట్లు ఇచ్చినట్లు టాక్. అయితే.. గతంలో కూడా చాలా మంది స్టార్ హీరోలు, దర్శకులు ఫ్లాప్ సినిమాల నష్టాలను పూడ్చేందుకు.. రెమ్యునరేషన్ రిటర్న్ చేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడు హరీష్ కూడా అలా చేయడంతో.. రవితేజ అభిమానులతో పాటు అతని ఫాలోవర్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించగా.. యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. ఈ సినిమాతో ఎంతో కొంత లాభపడింది ఎవరైనా ఉన్నారా అంటే? అది హీరోయిన్ మాత్రమే.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!