Gaddar Film Awards 2026: హైదరాబాద్లో ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2026’ ప్రదానోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ప్రజా యుద్ధనౌక గద్దర్ స్మారకార్థం తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించిన ఈ అవార్డుల వేడుకకు టాలీవుడ్ తారాలోకం తరలివచ్చింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకమైన ‘ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు’ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు..
Read Also: Lets Her Go With Lover: తన భార్యను ప్రియుడితో వెళ్లేందుకు అంగీకరించిన భర్త..
చిరంజీవి అవార్డు అందుకున్న అనంతరం భావోద్వేగంతో ప్రసంగించారు. అవార్డులు అందుకున్న విజేతలకు అభినందలు తెలియజేసిన చిరు.. తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.. ఎక్కడ కళాకారులు గౌరవించబడతారో ఆ రాజ్యం, దేశం బాగుపడుతుందని.. కళాకారులు ఉన్న చోట సుభిక్షంగా ఉంటుందన్నది నానుడి.. ఈ అవార్డులు అందజేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు అని తెలిపారు.. ఇక, “గత కొన్నాళ్లుగా సినిమా అవార్డులు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవార్డుల ప్రాముఖ్యతను గుర్తించి, మళ్లీ వాటిని పునరుద్ధరించడం అభినందనీయం. పురస్కారాలు కళాకారులకు కొత్త ఉత్సాహాన్నిస్తాయని తెలిపారు… ఇండియన్ సినిమా అంటే తెలంగాణ గుర్తుకు రావాలన్న సీఎం ఆలోచన గొప్పది అని చిరంజీవి పేర్కొన్నారు.
