Site icon NTV Telugu

షూటింగ్ పూర్తి చేసిన శర్వా, సిద్ధార్థ్

Entire shoot of MahaSamudram is now complete

ఆర్‌ఎక్స్ 100తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి రెండవ చిత్రం “మహా సముద్రం”. టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాల జాబితాలో ఈ చిత్రం కూడా ఉంది. ఎకె ఎంటర్టైన్మెంట్స్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వారికి జోడిగా హీరోయిన్లు అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ప్రధాన పాత్రధారుల ఫస్ట్ లుక్స్ రిలీజ్ కాగా… అవి సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. తాజాగా ఈ చిత్రబృందం మరో అప్డేట్ ను ప్రకటించింది.

Read Also : పాత్రల్లో పరకాయప్రవేశం చేసే గుమ్మడి!

ఈ సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తి కావడంతో గుమ్మడికాయను కొట్టేశారు మేకర్స్. ఈ విషయాన్ని తెలియజేస్తూ శర్వానంద్, సిద్ధార్థ్ ఉత్సాహంగా కన్పిస్తున్న ఓ పోస్టర్ ను వదిలారు. అందులో వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా ఉంది. ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా విశాఖపట్నం బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతోంది. చైతన్ భరద్వాజ్ సంగీత స్వరకర్త. “మహా సముద్రం” థియేటర్లలోనే విడుదల కానుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.

Exit mobile version