“పుష్ప”కు మళ్ళీ బ్రేక్… అనారోగ్యం బారిన క్రియేటివ్ డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం “పుష్ప” చిత్రీకరణను ఇటీవలే తిరిగి ప్రారంభించారు. కానీ మళ్ళీ తాజాగా ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. సుకుమార్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నాడని సమాచారం. అందుకే ఇప్పుడు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు. సుకుమార్ యాంటీబయాటిక్స్ తో పాటు ఇతర ఇంగ్లిష్ మందులకు దూరంగా ఉన్నాడు. ఆయన గత కొన్నేళ్లుగా హోమియోపతిని ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు కూడా వైరల్ ఫీవర్ కు ఆయన హోమియోపతినే వాడుతున్నట్లు సమాచారం.
Read Also : ప్రపంచంలోనే ప్రమాదకరమైన శత్రువు వాడే… “ఎనిమీ” టీజర్
Also Read
సుకుమార్ పూర్తిగా కోలుకున్న తర్వాత అల్లు అర్జున్ షూట్ తిరిగి ప్రారంభించాలనుకున్నాడు. మొదటి భాగం “పుష్ప” షూటింగ్ మొత్తాన్ని జూలై చివరి నాటికి పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ సుకుమార్ అనారోగ్యం శరవేగంగా జరుపుకుంటున్న సినిమా షూటింగ్ కు బ్రేక్ వేసింది. “పుష్ప” మొదటి భాగం ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో వస్తుంది. అల్లు అర్జున్ “పుష్ప 1” చిత్రీకరణ పూర్తి చేసి శ్రీరామ్ వేణు దర్శకత్వంలో “ఐకాన్”ను ప్రారంభించడానికి ఆసక్తి చూపుతున్నాడు. “ఐకాన్” పూర్తి చేశాక మళ్ళీ సుకుమార్ తో బన్నీ “పుష్ప 2” ప్రారంభించాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Uttar Pradesh: బీజేపీ “మిషన్ యూపీ 2027” స్టార్ట్ .. యోగీ సర్కార్ కీలక చర్య..
-
Extends Working Hours : తెలంగాణ ప్రజలకు ఊరట.. ఈ కార్యాలయాల్లో పెరిగిన పనివేళలు
-
Tamil Nadu: గవర్నర్ యూటర్న్.. కేరళం టూర్ రద్దు.. విజయ్కు అపాయింట్మెంట్
-
BJP Bengal Win: సరిహద్దుల్లో బీజేపీ ఘన విజయం.. బంగ్లాదేశ్ రాజకీయాలతో సంబంధం..
-
Tamil Nadu: గవర్నర్ మళ్లీ ట్విస్ట్.. విజయ్కు నో అపాయింట్మెంట్.. వెనక్కి వెళ్లిపోయిన టీవీకే అధినేత