స్టార్ హీరో డైరెక్షన్ లో తలైవా 170వ మూవీ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజనీకాంత్ యూఎస్ నుంచి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. రొటీన్ హెల్త్ చెకప్ ను ముగించుకుని ఇటీవలే చెన్నైకి తిరిగి వచ్చారు తలైవా. దానికి సంబంధించిన పిక్స్ నెట్టింట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి రజినీ “అన్నాత్తే” చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అందరి దృష్టి పడింది. రజినీకాంత్ నటనకు స్వస్తి పలకబోతున్నారని పలు ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన తదుపరి సినిమాలపై భారీ అంచనాలు, ఆసక్తి మొదలైపోయాయి. ఈ నేపథ్యంలో ఓ మీడియా కథనం ప్రకారం ఇప్పుడు రజినీకాంత్ చేతిలో రెండు చిత్రాలు ఉన్నాయట. వాటిలో ఒక చిత్రానికి కోలీవుడ్ స్టార్ హీరో దర్శకత్వం వహించబోతున్నారని అంటున్నారు.
Read Also : “బాహుబలి-2” రికార్డును బ్రేక్ చేసిన అజిత్ !
Also Read
- CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. 'జన నాయగన్' సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
- Peddi : బుకింగ్స్ ఓపెన్ చేసిన గ్లోబల్ స్టార్..అమెరికాలో ‘పెద్ది’ సందడి.. టికెట్ రేట్లు ఇవే!
- Karuppu: ‘కరుపు’ ట్రైలర్ టైమ్ ఫిక్స్.. సూర్య ఫ్యాన్స్కు మాస్ ట్రీట్ రెడీ!
- P. Bharat Bhushan: ఏపీ ఎఫ్డీసీ చైర్మన్గా పి. భరత్ భూషణ్..
రజినీకాంత్ 169వ చిత్రానికి పెరియసామి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇక జరుగుతున్న ప్రచారం మేరకు రజినీకాంత్ 170వ చిత్రానికి ఆయన అల్లుడు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహించబోతున్నారట. ఇకఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. కాగా ధనుష్ “పవర్ పాండి” చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తన రెండవ చిత్రానికి అతి త్వరలో దర్శకత్వం వహించనున్నట్లు నటుడు ఇటీవల వెల్లడించారు. అయితే ఆయన ప్రకటించిన చిత్రం రజినీకాంత్ తోఎం అంటున్నారు. రజనీకాంత్ కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.
తాజావార్తలు
-
Kerala CM: కేరళ కాంగ్రెస్లో వర్గపోరు.. సీఎంగా ఆయనకే రాహుల్ మద్దతు..
-
Pakistan Terror Attack: పాలు పోసి పెంచిన పామే కాటేసింది.. పాకిస్థాన్లో ఉగ్రదాడి!
-
CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. ‘జన నాయగన్’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
-
Hantavirus Outbreak: హంటావైరస్ కలకలం.. లక్షణాలు, చికిత్సపై WHO కీలక హెచ్చరిక.. కొత్త మహమ్మారిగా మారుతుందా..?
-
PM Modi: పరాన్నజీవి కాంగ్రెస్, డీఎంకేను వెన్నుపోటు పొడిచింది.. ప్రధాని మోడీ ఫైర్..