Site icon NTV Telugu

Darshan: పక్షవాతం వచ్చే అవకాశం ఉంది.. దర్శన్ కి బెయిల్ ఇవ్వండి!!

Darshan 100 Days

Darshan 100 Days

రేణుకాస్వామి హత్యకేసులో బళ్లారి సెంట్రల్ జైల్లో ఉన్న నటుడు దర్శన్ చాలా రోజులుగా వెన్నునొప్పితో బాధపడుతున్నారని, ఇప్పుడు చికిత్స చేయకపోతే పక్షవాతం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఆయన తరపు న్యాయవాదులు. మైసూరు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు 3 నెలల పాటు బెయిల్ ఇవ్వాలని దర్శన్ తరపు న్యాయవాది సి.వి. నగేష్ వాదించారు. అయితే వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తులు తీర్పును రేపటికి రిజర్వ్ చేశారు. బళ్లారికి చెందిన విమ్స్ వైద్యుడు ఇచ్చిన మెడికల్ రిపోర్టు, 24న నిర్వహించిన ఎంఆర్ఐ స్కాన్ రిపోర్ట్ ఆధారంగా దర్శన్ తరఫు న్యాయవాది సీవీ నగేష్ వాదించారు. దర్శన్‌కు వెన్నెముక నరాల ఎల్5, ఎస్1లలో సమస్య ఉన్నట్లు నిర్ధారణ అయింది. బళ్లారిలో న్యూరో నావిగేషన్ అందుబాటులో లేదు. దీంతో మైసూర్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు 3 నెలల పాటు బెయిల్ మంజూరు చేయాలని వాదించారు.

Shruti Haasan: ఏఐ టెక్నాలజీతో మెరిసిపోతున్న శ్రుతి హాసన్

అయితే, దీనికి కౌంటర్ ఇచ్చిన ఎస్పీపీ ప్రసన్న కుమార్.. దర్శన్‌ను బెంగళూరులోని విక్టోరియా లేదా బౌరింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు అనుమతించవచ్చని చెప్పారు. ఇక దర్శన్‌కు ఎలాంటి చికిత్స అందించాలో వైద్య బోర్డు నిర్ణయించాలి. బళ్లారికి చెందిన విమ్స్‌ డాక్టర్‌ ఇచ్చిన రిపోర్టుపై కూడా అనుమానాలున్నాయని చెప్పారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దర్శన్ తరపు న్యాయవాది సి.వి. నగేష్, వెంటనే చికిత్స చేయకపోతే, తిమ్మిరి మరియు పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. ఎల్5, ఎస్1లో ఉబ్బెత్తుగా ఉండటంతో తీవ్రమైన సమస్య ఉంది. కాబట్టి దర్శన్‌కి శస్త్ర చికిత్స అవసరం, 2022 నుంచి ఈ సమస్య ఉంది. అయితే ఇటీవల సమస్య ఎక్కువైంది. అందువల్ల చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు. ఆపరేషన్ కోసం 3 నెలలు బెయిల్ ఇవ్వండి అని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తులు నటుడు దర్శన్‌కు చికిత్స నిమిత్తం బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును రేపటికి రిజర్వ్ చేశారు.

Exit mobile version