దర్శకుడి ఆలోచనను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించే సృష్టికర్త సినిమాటోగ్రాఫర్. నిర్మాత పెట్టే ప్రతి రూపాయి బడ్జెట్ వాల్యూని స్క్రీన్ మీద పదింతలు చేసి చూపించే మాయాజాలీకుడు. ‘స్లమ్డాగ్ మిలియనీర్’, ‘మిషన్ ఇంపాజిబుల్ 4’ వంటి హాలీవుడ్ చిత్రాలతో పాటు బాలీవుడ్లో ‘ఏ దిల్ హై ముష్కిల్’, ‘జెర్సీ’ వంటి భారీ చిత్రాల కెమెరా డిపార్ట్మెంట్లో పనిచేసి తన ప్రతిభను చాటుకున్నారు కిషోర్ బోయిడాపు (దుర్గ కిషోర్ కుమార్).
ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు ప్రధాన పాత్రలో, ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో ఆయన పనిచేసిన సరికొత్త వెబ్ సిరీస్ ‘‘మేము కాప్లం’’. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ‘జీ5’లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతూ అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఈ సిరీస్ను కేవలం 17 రోజుల్లోనే అద్భుతమైన విజువల్స్తో తెరకెక్కించిన కిషోర్ బోయిడాపు.. తన సినీ ప్రయాణం, హాలీవుడ్ వర్కింగ్ స్టైల్ మరియు ఈ సిరీస్ విశేషాలను తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ సంగతులు ఆయన మాటల్లోనే..
“ఒక వెబ్ సిరీస్ను కేవలం 17 రోజుల్లోనే కంప్లీట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. కానీ పక్కా ప్రీ-ప్రొడక్షన్ ప్లానింగ్ వల్ల ఇది సాధ్యమైంది. నేనూ, డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి గారు లొకేషన్ల రెక్కీ చేస్తున్నప్పుడే.. ఏ సీన్ని ఎలా తీయాలి, ఏ లెన్స్ వాడాలి అనేదానిపై ఆఫీస్లోనే పూర్తి క్లారిటీ తెచ్చుకున్నాం. మా విజన్ను నమ్మి అండగా నిలిచిన ప్రొడ్యూసర్ బీవీఎస్ రవికి, నటీనటులు నాగబాబు, శ్రీను, రవికి నా ధన్యవాదాలు. అందరి కో-ఆర్డినేషన్ వల్లే అనుకున్న సమయం కంటే ముందే క్వాలిటీతో షూట్ పూర్తి చేయగలిగాం.” అని కిషోర్ బోయిడాపు ముగించారు.
