వివాదంలో ‘ఛావా’… చరిత్రని వక్రీకరించారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన మరాఠా పోరాట యోధుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ బయోపిక్ ‘ఛావా’ అంచనాలను మించి రాణిస్తుంది.ఇప్పుటికే 400 కోట్లు కొల్లగొట్టి అదే రేంజ్ లో దూసుకుపోతుంది.ఫైనల్ రన్ 700 కోట్లు అనే ప్రెడిక్షన్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాపై రిలీజ్ రోజు నుండి కొన్ని నెగెటివ్ కామెంట్స్, చరిత్రని వక్రీకరించారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.
ఛావా పై తాజా కాంట్రావర్సీ మాత్రం మరింత అగ్గిని రాజేస్తోంది. విషయం ఏంటంటే ఈ సినిమాలో శంభాజీ మహారాజ్ ని దగ్గరే నమ్మకంగా ఉంటున్న గనోజి, కన్హోజి అనే ఇద్దరు మరాఠా వీరులు వెన్నుపోటు పొడిచినట్టు చూపించారు.శంభాజీ తమకు అధికారం అడిగితే ఇవ్వలేదు అన్న కోపంతో ఔరంగజేబుతో చేతులు కలిపి శంభాజీ యుద్దానికి సిద్దమవుతున్న సమయంలో దగ్గరుండి మొఘల్ సైన్యానికి పట్టించినట్టు చూపించారు.గనోజి, కన్హోజి ఇద్దరూ కూడా షిర్కే వంశానికి చెందిన వారు.సినిమాలో తమ కుటుంబ పెద్దలను నెగెటివ్ గా చూపించారని, దీని వల్ల తమ కుటుంబం పరువుకి భంగం వాటిల్లిందని,అందుకే ఈ సినిమా దర్శక నిర్మాతలు తమకు 100 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read
- Jabardasth Mahesh: ‘ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలీదు’.. సడన్గా కమెడియన్ మహేష్ షాకింగ్ వీడియో.. అసలేమైంది?
- Isakapatnam Trailer: అధికారం కోసం కన్నతండ్రినే ఢీకొట్టిన కూతురు!"
- Maa Inti Bangaram : సమంత ‘గోల్డెన్ రన్’.. 17 లక్షలకు పైగా టికెట్లతో ‘మా ఇంటి బంగారం’ సరికొత్త రికార్డ్!
- NBK 112: కొరటాల సినిమా కోసం రూల్స్ బ్రేక్ చేసిన బాలయ్య
దీనిపై స్పందించిన చావా డైరెక్టర్ లక్ష్మణ్ ఉఁటేకర్ దిగివచ్చి షిర్కే క్షమాపణలు చెప్పారు.’ఎవరిని కించపరచాలి అనేది తమ ఉద్దేశం కాదు.అందుకే ఈ సినిమాలో గనోజి, కన్హోజి పేర్లు మాత్రమే వాడాం తప్ప వారి ఇంటిపేరు కానీ,ప్రాంతం పేరు కానీ వాడలేదు అంటూ చెప్పుకొచ్చారు.మా వల్ల వారికి ఏదైనా ఇబ్బందికలిగి ఉంటే క్షమించాలని కోరారు.
అయితే ఈ క్షమాపణతో వివాదం సద్దుమణిగినట్టు కనిపిస్తున్నా కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి.శంభాజీని గనోజి, కన్హోజి పట్టించకపోతే మొఘల్ సైన్యానికి ఎలా దొరికాడు?, చరిత్రని నిజంగానే వక్రీకరించారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.నిజానికి శంభాజీ మహారాజ్ అరివీర భయంకరమయిన మరాఠా పోరాట యోధుడు…కానీ ఆయన మద్యం ఎక్కువగా తీసుకునేవాడని,స్త్రీ లోలుడు అని,శివాజీ మహారాజ్ చిన్నతనంలో శంభాజీని స్వయంగా కారాగారంలో వేయించాడని కొంతమంది చెబుతున్నారు.తాను సింహాసనాన్ని అధిష్టించడం కోసం తన పినతల్లిని, ఆమె కొడుకుని కారాగారంలో వేసాడని కూడా కొన్నికథనాలు ఉన్నాయి.ఆ తర్వాత ఆమెకి మరణ శిక్ష విధించాడు అని చెబుతారు కొంతమంది.
అయితే మద్యం మత్తులో ఉన్న సమయంలో శంభాజీని మొఘల్ సైన్యం బంధించింది అని కొంతమంది వాదన. ఏది ఏమైనా? ఛత్రపతి శంభాజీ మహారాజ్ తెగువ,పోరాట పటిమ,యుద్ధ నైపుణ్యం మాత్రం అందరు ఒప్పకునితీరాలి అనేది ఎక్కవమంది అభిప్రాయం.అయితే బయోపిక్ తీస్తున్నప్పుడు,దానికి సంబందించిన పూర్తి ఆధారాలు లేనప్పుడు ఇలాంటి కాంట్రవర్సీలు తప్పవు.త్వరలో తెలుగులో రిలీజ్ కాబోతున్న చావా ఇక్కడ ఎలాంటి సంచనాలు నమోదు చేస్తుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
-
Jabardasth Mahesh: ‘ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలీదు’.. సడన్గా కమెడియన్ మహేష్ షాకింగ్ వీడియో.. అసలేమైంది?
-
Story Board: బీజేపీ ఎలాంటి ఎత్తుగడలు వేస్తోంది..? దేశంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా..?
-
IND Vs IRE: పసికూన చేతిలో భారత్ ఘోర ఓటమి.. ఎగిరిగంతేసిన ఐర్లాండ్ అభిమానులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!