ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల హడావుడి కొనసాగుతుంది.ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎన్నికల హడావిడిలో ఎంతో బిజీ గా వున్నారు.ఈ నేపథ్యంలో పవన్ తన లైనప్ లో వున్న మూడు సినిమాల షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చారు.వాటిలో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ మరియు ఓజి సినిమాలు వున్నాయి .ప్రస్తుతం ఈ మూడు చిత్రాల ప్రొడ్యూసర్స్ పవన్ డేట్స్ కోసం పవన్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు .ఇదిలా ఉండగా క్రిష్ – పవన్ కాంబోలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడో ప్రారంభం అయిన విషయం తెలిసిందే . ఈ సినిమా పవన్ కల్యాణ్ కెరియర్ లో మొదటి పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న విషయం తెలిసిందే..
అయితే ఈ సినిమా గత కొంతకాలంగా ఆగిపోయిందంటూ వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, పోస్టర్స్ రిలీజ్ చేసి మేకర్స్ సినిమాపై అంచనాలను పెంచేశారు.. కానీ ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ లేకపోవడం, ఇన్ని సంవత్సరాలైనా సినిమా షూటింగ్ కూడా పూర్తి కాకపోవడంతో పవన్ కల్యాణ్ అభిమానులలో ఈ సినిమా ఆగి పోయిందేమో అనే అభిప్రాయం మొదలయింది కానీ ఈ మూవీ మేకర్స్ తాజాగా పవన్ ఫాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ అందించారు .మే 2 వ తేదీన ఉదయం 9 గంటలకు ఈ చిత్ర టీజర్ విడుదల చేయనున్నట్లుగా.. ధర్మం కోసం యుద్ధం అంటూ మేకర్స్ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు దీనితో పవన్ ఫాన్స్ ఖుషి అవుతున్నారు.
𝐁𝐀𝐓𝐓𝐋𝐄 𝐅𝐎𝐑 𝐃𝐇𝐀𝐑𝐌𝐀 ⚔️🔥
Teaser of the much-anticipated #HariHaraVeeraMallu will be out on MAY 2nd @ 9:00 AM! 💥#HHVMTeaserOnMay2nd ❤️🔥@PawanKalyan @DirKrish @thedeol @AgerwalNidhhi @mmkeeravaani @AMRathnamOfl pic.twitter.com/W6tiwst5Gm
— Hari Hara Veera Mallu (@HHVMFilm) April 30, 2024
