పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించనున్న భారీ చిత్రాల జాబితాలో “అయ్యప్పనుమ్ కోషియం” రీమేక్ కూడా ఉంది. ఇందులో రానా మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ యాక్షన్ డ్రామాలో పవన్ భార్య పాత్రను నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ రానా భార్యగా కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదికి సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. ఈ చిత్రం 2022 సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ లో కొంత ఆలస్యం జరిగింది. వచ్చే రెండు వారాల్లో యూనిట్ తిరిగి షూటింగ్ రీస్టార్ట్ చేయనుంది. మొత్తం చిత్రీకరణ ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తవుతుంది.
Read Also : నాని “దారే లేదా”పై నాగార్జున ప్రశంసలు
పండగ రోజును క్యాష్ చేసుకోవాలని భావించిన మేకర్స్ ఈ చిత్రం కోసం సంక్రాంతి విడుదలపై ఇప్పుడు దృష్టి సారించారు. అయితే టాలీవుడ్ బడా హీరోల చిత్రాలన్నీ దాదాపు సంక్రాంతిని టార్గెట్ చేస్తుంటాయి. మరి ఈసారి సంక్రాంతి రేసులో ఈ చిత్రం కూడా ఉంటే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఫైట్ తప్పదు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో మేకర్స్ అంతా సినిమా షూటింగ్స్ రీస్టార్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం షూట్ జూలై 11 నుండి హైదరాబాద్ లో ప్రారంభం కానుండగా… పవన్ తో పాటు మిగతా ప్రధాన తారాగణం అంతా అదే రోజు షూట్ లో చేరబోతున్నారు.