నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా… మొన్న శుక్రవారం రోజున విడుదలైన సంగతి తెలిసిందే. హిట్ టాక్ రావడంతో ఈ సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు జనాలు. అటు సినిమా స్టార్లు అలాగే పొలిటికల్ లీడర్ లు కూడా ఈ సినిమాకు ఫిదా అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖ జిల్లాలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది.
విశాఖ జిల్లా నర్సీపట్నం లోని ఓ థియేటర్ కు అఖండ సినిమా చూసేందుకు ఏకంగా అఘోరాలు వచ్చేశారు. శరీరానికి విభూతి.. అలాగే తాయత్తు లతో థియేటర్ కు అఘోరాలు వచ్చారు. అఖండ మూవీతో గుర్రాలను కూడా థియేటర్కు బాలయ్య బాబు తీసుకు వచ్చాడని ఆయన ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. కాగా.. అఖండ సినిమా రెండు తెలుగు స్టేట్స్ లోనే కాకుండా…ఓవర్ సిస్ లోనూ బాగా కలెక్షన్లను రాబుడుతోంది.
