తెలుగులో ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప్రణీత సుభాష్ తర్వాత సిద్దార్థ్ తో చేసిన ‘బావ’ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ సినిమా తరువాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘అత్తారింటికి దారేది’ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఎక్కువగా కన్నడ తెలుగు, తమిళ భాషల్లో నటించే ఈ భామ సైలెంట్ గా వివాహం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. నిజానికి గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ నేపథ్యంలో చాలా మంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుని ఒక్కటయ్యారు. ఈ భామ కూడా రెండో వేవ్ లో పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది. బెంగళూరుకు చెందిన నితిన్ రాజు అనే ఒక బిజినెస్ మాన్ తో ఈ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయం మీద ప్రణీత ఇంకా అధికారికంగా స్పందించలేదు. ప్రణీత స్నేహితురాలు ఒకరు తన సోషల్ మీడియా వేదికగా పెళ్లి ఫోటోలు పోస్ట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలపడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిజానికి వివాహం గ్రాండ్ గా చేసుకోవాలని భావించినప్పటికీ కరోనా కారణంగా ఇలా సింపుల్ గా కానిచ్చేశారని తెలుస్తోంది.