దక్షిణాది టాలెంటెడ్ హీరోయిన్లలో అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ఒకరు. పక్కింటి అమ్మాయిలా కనిపించే ఈ క్యూట్ బ్యూటీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. ఇటీవల యంగ్ హీరో సందీప్ కిషన్ సరసన ఎ1 ఎక్స్ప్రెస్”, కార్తికేయ సరసన “చావు కబురు చల్లగా” చిత్రాలలో హీరోయిన్ గా లావణ్య కన్పించింది. కానీ ఆ రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. అయితే తాజాగా లావణ్య ఓ నేచర్ కేఫ్ ను నిర్మించబోతోంది అనే వార్తలు విన్పిస్తున్నాయి.
Read Also : బ్లాక్ అండ్ వైట్ రష్మిక… పిక్ వైరల్
ఈ యువ నటి ముస్సోరీకి సమీపంలో ఉన్న కొండప్రాంతమైన చమసారిలోని తన వ్యవసాయ భూమిలో పర్యావరణ అనుకూల కేఫ్ను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ముద్దుగుమ్మ డెహ్రాడూన్ నుండి వచ్చినప్పటికీ, ఆమెతో పాటు కుటుంబ సభ్యులు ఎప్పుడూ చమసారిలో గడపడానికి ఇష్టపడతారు. అందుకే ఈ అందాల రాక్షసి తన ప్రియమైనవారు విశ్రాంతి సమయంలో సరదాగా గడపగలిగే కేఫ్ను అక్కడ నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఈ స్థలాన్ని తన కుటుంబం, స్నేహితుల కోసం ప్రకృతి వనంగా మార్చాలని ఆమె భావిస్తోందట.
