ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 (ZEE5) మరో వినూత్నమైన ఒరిజినల్తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. విభిన్న కథాంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ సంస్థ నుంచి తాజాగా రాబోతున్న సంచలనాత్మక కోర్ట్ రూమ్ డ్రామా ‘అబ్జెక్షన్ మై లార్డ్’. ‘నోటరీ పరశురాం’ అనేది దీని ట్యాగ్లైన్. టాలీవుడ్ ప్రముఖ నటుడు శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఈ సిరీస్లో అనన్య శర్మ, ముఖేష్ రుషి, స్నేహాల్, సమీర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డ్రీమ్ హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్పై రాజ్కుమార్ ఆకెళ్ల నిర్మించిన ఈ ప్రాజెక్ట్కు సంతోష్ అయ్యప్పన్ దర్శకత్వం వహించారు. మొత్తం 7 ఎపిసోడ్లతో రూపొందిన ఈ ఉత్కంఠభరితమైన సిరీస్ జూలై 31 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఘనంగా ప్రివ్యూ ఈవెంట్ను నిర్వహించింది. ఈ వేడుకలో పాల్గొన్న నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ సినిమాను మించిన ఉత్కంఠ ఈ సిరీస్లో ఉంటుందని తెలిపారు. “జీ5తో నా ప్రయాణం చాలా అద్భుతంగా సాగుతోంది. ఇది నేను ఈ వేదికపై చేస్తున్న మూడో వెబ్ సిరీస్. వీటితో పాటు ‘డ్రామా జూనియర్స్’ షో కూడా చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. సిరీస్ షూటింగ్ సమయంలో సినిమాలు చేసేదాని కంటే ఎక్కువ కష్టపడ్డాం. కానీ, ఆ కష్టమంతా ఆస్వాదిస్తూ చేశాం. దర్శకుడు సంతోష్ అయ్యప్పన్ ప్రతి సీన్ను ఎంతో క్లారిటీతో తెరకెక్కించారు. నిర్మాత రాజ్కుమార్ అందించిన సహకారం మరువలేనిది” అని శ్రీకాంత్ పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ సిరీస్ను మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వీక్షించి అభినందించడం తమ టీమ్కు లభించిన అతిపెద్ద విజయం అని శ్రీకాంత్ భావోద్వేగంతో వెల్లడించారు. ముఖేష్ రుషి వంటి గొప్ప నటులతో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభవమని, ప్రతి పాత్రకు సినిమాలో మంచి ప్రాధాన్యత ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

