టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’ అనే విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పలాస సినిమాతో విమర్శకుల ప్రసంశలు అందుకున్న కరుణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఈ చిత్రంలో సుధీర్ బాబు ‘సూరిబాబు’ అనే లైటింగ్ బాయ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాను 70ఎమ్.ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా – శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సంగీత బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించనున్నారు. కాగా తాజాగా ఈ చిత్రంలో తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేశారు సుధీర్ బాబు. ‘సూరిబాబు పాత్రకు డబ్బింగ్ చెప్పడాన్ని ఎంజాయ్ చేశాను. గ్రేట్ వైబ్స్’ అంటూ సుధీర్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రంతో విలక్షణ పాత్రతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు సుధీర్ బాబు.