Chiranjeevi: విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి ప్రపంచ దేశాలు మనవైపు చూసేలా సినిమాలు చేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Light and Sound Show at Golconda Fort: ఈ రోజు నుంచి చారిత్రక గోల్కొండ కోట అత్యాధునిక హంగులతో కనువిందు చేయబోతుంది. పర్యాటకులను పెంచడమే లక్ష్యంగా రాత్రి వేళ మరింత ఆకర్షణీయంగా కనిపించేలా, ఈ కోట చరిత్రను తెలిపేలా సౌండ్ అండ్ లైట్ షోను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, ఎంపీ విజయేంద్రప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరు అయిన ఈ వేడుకలో లైట్ షోను ప్రారంభించారు. ఈ క్రమంలో చిరంజీవి మాట్లాడుతూ ప్రపంచ దేశాలు భారత దేశ చలన చిత్ర వైపు చూస్తున్నాయని, విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి లాంటి వాళ్ళు అంతర్జాతీయ స్థాయి సినిమాలు చేస్తున్నారని అన్నారు. వెయ్యి పదాలు చెప్పలేని దాన్ని ఒక దృశ్యం చెబుతుందని భవిష్యత్ తరాలకు చెప్పేందుకు కలర్ ఫుల్ గా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లైట్ అండ్ లేజర్ షో ఏర్పాటు చేయడం అభినందనీయం అని అన్నారు. గతంలో కేంద్ర మంత్రిగా జాతీయ స్థాయిలో ఉమ్మడి ఎపీని టూరిజం లో నెంబర్ గా నిలబెట్టానని అన్నారు.
Kurchi Tatha: గుంటూరు కారం కుర్చీ తాత అరెస్ట్.. మహేష్ బాబు వల్లనే అంటూ ప్రచారం… అసలు విషయం ఏంటంటే
Also Read
- Peddi OTT Partner: ‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- AamirKhan Marriage: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అంటా? నెట్టింట్ల వైరల్ అవుతున్న లగ్గం డేట్!
- Ram Charan: రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్.. కూకట్పల్లిలో మెగా పవర్ స్టార్ ఆలయం! పూజలు చేస్తున్న ఫ్యాన్స్..
- Vijay Antony: సీఎం విజయ్ని కలిసిన ‘బిచ్చగాడు’ హీరో.. నెట్టింట వైరల్గా మారిన ఫోటోలు!
ఇక విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో భారత పర్యాటక శాఖ అభివృద్ధి చెందాలని, గోల్కొండలో శ్రీ రామదాసు రాముడిపై పాటలు పాడారు, ఆయన బాధలు చూడలేక స్వయంగా శ్రీరామచంద్రుడు తనీషా దగ్గరకు వచ్చి బాకీ చెల్లించి రామదాసును విడిపించారు. అయోధ్యలో రాముడికి బలరాముడు కట్టిన గుడిని బాబర్ నాశనం చేస్తే 700 ఏళ్లుగా ఆయన గుడి లేకుండా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చతురస్ర రాశుల సృష్టి కర్త అయిన రాముడు తన గుడిని తను నిర్మించుకోలేడా? కానీ భక్తులకు ఆ అవకాశం ఇచ్చారని అన్నారు. ఎంత మంది త్యాగాల ఫలితంగా అయోధ్యలో రాముడి గుడి రూపుదిద్దికుందని, 2 రోజుల రోజుల క్రితం అయోధ్యలో రాముడి గుడికి మోడీ ప్రాణ ప్రతిష్ట చేశారని అన్నారు. ఆ క్షణంలో శ్రీ రామదాసు పాడిన జగమంతా రామమయం పాటతో దేశమంతా మారుమోగిందని అలాంటి పాట పుట్టిన చోట అద్భుతమైన లేజర్ షో జరగడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ షోను వీక్షించడానికి నేను కూడా చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నానని అన్నారు.
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!