Site icon NTV Telugu

హైదరాబాద్ లో కంగనాపై కేసు నమోదు

ప్రస్తుతం ఎక్కడ విన్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పేరే వినిపిస్తుంది. అమ్మడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రచ్చ లేపడమే కాదు ఏకంగా పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టడం వరకు వచ్చింది. ఇటీవల పద్మశ్రీ అవార్డు అందుకున్న కంగనా.. అవార్డు తీసుకున్న అనంతరం దేశ స్వాతంత్ర్యం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసింది. “1947లో మనకు వచ్చింది భిక్ష మాత్రమే. 2014లో అసలైన స్వాతంత్ర్యం వచ్చిందని” అంటూ చెప్పుకొచ్చింది. ఇక దీంతో నెటిజన్లతో పాటు పలు రాజకీయ పార్టీలు కంగనాపై విరుచుకు పడ్డారు.

తాజాగా తెలంగాణ శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్ హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో కంగనాపై ఫిర్యాదు చేశారు. దేశ స్వాతంత్ర్యం గురించి కంగనా అలా ఎలా మాట్లాడగలుగుతుందని, ఆమె కూడా ఒక భారతీయురాలేనని గుర్తుంచుకోవాలని సుదర్శన్ అన్నారు. ఆమె ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడడం మానుకోవాలని, అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కంగనాను అరెస్ట్ చేయాలని, ఆమెకిచ్చిన పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Exit mobile version