Site icon NTV Telugu

Aadavallu Meeku Joharlu : ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్టార్ హీరోయిన్లతో పాటు మరో గెస్ట్

AMJ

శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన “ఆడవాళ్లు మీకు జోహార్లు” చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మార్చి 4న ఈ సినిమాలో థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ప్రముఖ నటీమణులు రాధికా శరత్‌కుమార్, ఖుష్బు సుందర్, ఊర్వశి కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. తిరుమల కిషోర్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ను మరింత స్పెషల్ గా చేయబోతున్నారు. ఈ వేడుకకు ఇద్దరు స్టార్ హీరోయిన్లతో పాటు ఓ స్టార్ డైరెక్టర్ గెస్ట్ గా రాబోతున్నారు.

Read Also : Bheemla Nayak : ఆర్జీవీ రివ్యూ… ఏమన్నాడంటే?

“ఆడవాళ్లు మీకు జోహార్లు” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథులుగా విచ్చేస్తున్న కీర్తి సురేష్, సాయి పల్లవి అదే వేదికపై థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నారు. ఫిబ్రవరి 27న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో “ఆడవాళ్లు మీకు జోహార్లు” ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ గ్రాండ్ గా జరగనుంది. ఈ వేడుకకు జీనియస్ దర్శకుడు సుకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు.

Exit mobile version