Vastu Tips: వేసవిలో మట్టి కుండ తీసుకున్నారా..? మీ అదృష్టం మారలంటే ఇంట్లో ఈ దిశలో పెట్టండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vastu Tips: వేసవి సమయంలో సామాన్యుడి ఫ్రిజ్గా మట్టి కుండలకు పేరు ఉంది.. ఇక చాలా మంది ఫ్రిజ్ వాటర్ తీసుకోవడం ఇష్టం లేనివారు కూడా మట్టి కుండలను తీసుకోవడం చూస్తుంటాం.. వేసవి కాలంలో మట్టి కుండలు ఉపయోగించడం శరీరానికి చల్లదనాన్ని అందించడమే కాకుండా, వాస్తు పరంగా కూడా ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా వైశాఖ మాసంలో ఇంట్లో చేసే చిన్న మార్పులు సానుకూల శక్తిని పెంచి, ఆర్థిక శ్రేయస్సును తీసుకువస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. మీరు కూడా మీ ఇంట్లో సుఖశాంతులు, సంపద పెరగాలని కోరుకుంటే ఈ సులభమైన వాస్తు చిట్కాలను పాటించడం మంచిది అంటున్నారు వాస్తు నిపుణులు..
* మొదటిగా, ఇంటి ఈశాన్య దిశలో మట్టి కుండను ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ దిశ పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. శుభ్రమైన నీటితో నింపిన మట్టి కుండను ఈశాన్యంలో ఉంచితే ఇంట్లో చల్లదనం, ప్రశాంతతతో పాటు సానుకూల శక్తి పెరుగుతుంది. ఇది ఆర్థిక స్థిరత్వానికి కూడా దోహదపడుతుందని నమ్మకం.
Also Read
- Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Kitchen Hacks: వంట పనిని సగం తగ్గించే కిచెన్ టిప్స్ .. బిగినర్స్ కోసం స్పెషల్ గైడ్!
- Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
* వైశాఖ మాసంలో తులసి మొక్కకు ప్రత్యేక పూజ చేయడం ఎంతో మంగళకరంగా భావిస్తారు. ప్రతి ఉదయం తులసి మొక్కకు నీరు పోయడం, సాయంత్రం నెయ్యి దీపం వెలిగించడం ద్వారా ఇంటి వాతావరణం శుద్ధి అవుతుంది. దీని వల్ల ప్రతికూల శక్తి తగ్గి, మానసిక ప్రశాంతత పెరుగుతుంది.
* ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా ఉత్తర దిశలోని ప్రదేశాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. పనికిరాని వస్తువులను తొలగించడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తి సులభంగా ప్రవహిస్తుంది. చిందరవందరగా ఉన్న ప్రదేశాల్లో మంచి శక్తి నిలవదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
* మనీ ప్లాంట్ను ఇంట్లో ఉంచడం కూడా శ్రేయస్సుకు సంకేతంగా భావిస్తారు. దీనిని నీటితో నింపిన గాజు పాత్రలో పెట్టి ఆగ్నేయ దిశలో ఉంచితే సంపద, అభివృద్ధి పెరుగుతాయని చెబుతారు. ఇది మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుంది.
* ఇక, ప్రతి ఉదయం ఇంటి ప్రధాన ద్వారం వద్ద నీళ్లు చల్లడం కూడా ఒక మంచి అలవాటు. ఇది ఇంట్లోకి వచ్చే ప్రతికూల శక్తిని తగ్గించి, సానుకూల వాతావరణాన్ని తీసుకువస్తుంది. కావాలంటే ప్రవేశ ద్వారం దగ్గర నీటితో నింపిన రాగి పాత్రను ఉంచుకోవచ్చు. ఇలా.. ఈ చిన్నచిన్న వాస్తు మార్పులు పాటిస్తే, మీ ఇంట్లో సుఖశాంతులు, ఆర్థికాభివృద్ధి పెరిగి జీవితం మరింత సంతోషంగా మారుతుంది.
తాజావార్తలు
-
Jayam Ravi Divorce Case : మళ్ళీ కోర్టు మెట్లెక్కిన జయంరవి భార్య… ఈసారి ఏమైందంటే ?
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Blaupunkt QLED TV: థియేటర్ లాంటి అనుభవం.. Google TV 5.0తో బ్లాపంక్ట్ కొత్త QLED స్మార్ట్ టీవీలు.. చౌక ధరకే
-
RC 17 : సుకుమార్ సినిమాలో చరణ్ ఇలా ఉంటాడా?
-
Arjun Tendulkar: అచ్చు తండ్రి మాదిరే.. అర్జున్ టెండూల్కర్ గొప్ప మనసు.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?