Kitchen Tips : పప్పులు పురుగు పట్టకుండా ఎక్కువకాలం ఉండాలంటే..ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పప్పుల ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు.. అందుకే చాలా మంది ఒకేసారి కొని పెట్టుకుంటారు.. ఏడాదికి సరిపడా పప్పుధాన్యాలను ఒకేసారి కొని స్టోర్ చేసుకుంటూ ఉంటారు. అవి పాడవ్వకుండా, పురుగులు పట్టకుండా జాగ్రత్తగా ఎయిర్ టైట్ డబ్బాల్లో స్టోర్ చేస్తూ ఉంటారు, తడి చేతులతో తాకరు. అయినా కూడా కొన్నిసార్లు పప్పులు, బియ్యం పురుగులు పడుతూ ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలం ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే.. పప్పులు, బియ్యానికి పురుగులు పట్టకుండా రక్షించుకోవచ్చు… ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వెల్లుల్లిని వాడటం మంచిది..పప్పుల డబ్బాలో కొన్ని పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పప్పులకు పురుగులు పట్టకుండా ఉంటాయి. మీరు పప్పుల పెట్టెలో 4-5 వెల్లుల్లి రెబ్బలను ఉంచండి. ఆవి ఎండిపోయిన తర్వాత, అవి తీసి మీరు ఫ్రెష్ వెల్లుల్లి రెబ్బలు పెట్టండి..
Also Read
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
- Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
- Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
అలాగే ఎండు వేపాకులను వాడటం అనేది ఎన్నో ఎళ్లుగా ఫాలో అయ్యే పద్ధతి. ఇది పప్పులను పురుగులు పట్టకుండా రక్షించడానికి ప్రభావవంతంగా పని చేస్తుంది. మీరు పప్పులు, బియ్యం స్టోర్ చేసే డబ్బాలో ఎండిపోయిన వేప ఆకులను ఉంచండి. ఇది పప్పుధాన్యాలలో కీటకాలు రాకుండా రక్షిస్తుంది. పప్పులే కాదు, అలమారాల్లో ఎండు వేప ఆకులను ఉంచితే సిల్వర్ ఫిష్ పురుగులు రాకుండా ఉంటాయి..
లవంగాలను వంట రుచి పెంచడానికి వాడుతుంటాం. ఇవి పప్పుధాన్యాలను పురుగులు పట్టకుండా రక్షిస్తాయి కూడా. మీరు చేయాల్సిందల్లా పప్పులు స్టోర్ చేసిన డబబ్బాలో 8-10 లవంగాలు వేసిన క్లాత్ బ్యాగ్ ఉంచండి. ఆ డబ్బాకు గాలి చొరబడకుండా చూసుకోండి..
మీ పప్పు దినుసులు ఉంచిన డబ్బాలో 3 ఎండుమిరపకాయలు ఉంచండి. ఎండు మిర్చీ ఘాటుకు పురుగులు పట్టకుండా ఉంటాయి..
పప్పులను ఫ్రిజ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే పురుగుల నుంచి పప్పుల నుంచి రక్షించడమే కాదు, పప్పులను ఎక్కువ కాలం తాజాగా ఉంచుకోవచ్చు. మీరు వాటిని గాలి చొరబడని కంటైనర్లలో లేదా జిప్లాక్ ప్యాకెట్లలో నిల్వ చేయవచ్చు..
ఒకవేళ పప్పుకు పురుగు పట్టినట్లు గుర్తిస్తే.. దాన్ని క్లాత్పై వేసి కనీసం రెండు మూడు రోజులు ఎండలో ఉంచండి. చీకటి, చల్లగా ఉన్న ప్రదేశాలలో పురుగులు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, పప్పులను ఎండలో ఉంచితే అవి పారిపోతాయి.. అప్పుడప్పుడు ఎండలో ఉంచితే మంచిదని నిపుణులు చెబుతున్నారు.. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి..
తాజావార్తలు
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
-
Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
-
Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!