Shocking : రోజురోజుకి ప్లాస్టిక్ వినియోగం పెరుగుతూ పర్యావరణానికే కాకుండా మన ఆరోగ్యానికీ తీవ్ర ముప్పు కలిగిస్తోంది. ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ప్లాస్టిక్ వినియోగం తగ్గడం లేదు. తాజా అధ్యయనం ప్రకారం, మైక్రోప్లాస్టిక్స్ శరీరంలోకి ప్రవేశించి మెదడులో పేరుకుపోతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ ఉత్పత్తి 2000 నుంచి రెట్టింపు కాగా, 2060 నాటికి ఇది మూడింతలు పెరిగే అవకాశం ఉందని అంచనా. న్యూమెక్సికోలో 2016 మరియు 2024లో మరణించిన వ్యక్తుల మెదడు కణజాలాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు, కాలక్రమేణా మైక్రోప్లాస్టిక్స్ స్థాయి పెరిగిందని గుర్తించారు. ఈ అధ్యయనం వివరాలను నేచర్ మెడిసిన్ జర్నల్లో ప్రచురించారు. మైక్రోప్లాస్టిక్స్ ప్రభావంపై స్పష్టమైన ఫలితాలు లేకపోయినా, న్యూరోలాజికల్ సమస్యలు, మతిమరుపు, జ్ఞాపకశక్తి తగ్గుదల వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి రక్త-మెదడు అవరోధాన్ని దెబ్బతీసి, ఇన్ఫ్లమేషన్ పెంచి అవయవాలను నాశనం చేసే ప్రమాదమూ ఉందని చెబుతున్నారు.
Off The Record: పార్టీ ఏదైనాసరే.. ఆ బ్రదర్స్కు కేసులు కామనా..?
తగ్గించుకోవాల్సిన జాగ్రత్తలు
- ప్లాస్టిక్ బాటిళ్లను వాడటం, రీయూజ్ చేయడం మానేయాలి.
- వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ కంటైనర్లలో ఉంచకూడదు. గ్లాస్ లేదా సిరామిక్ పాత్రలు ఉపయోగించడం మంచిది.
- ఫుడ్ కటింగ్ కోసం ప్లాస్టిక్ బోర్డుల బదులు చెక్క బోర్డులు వాడాలి.
- పిల్లలకు పాలు, ఫార్ములా కోసం సిలికాన్ బాటిళ్లు వాడాలి.
ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం మన ఆరోగ్య రక్షణకు మొదటి అడుగు. ఆహారం నుంచి నీటి బాటిల్ వరకు ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మైక్రోప్లాస్టిక్స్ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.
War 2: హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య “వార్”.. ఇది ముగింపు కాదంటూ తారక్ ట్వీట్..!
