హిందువులు తులసిని పవిత్రంగా భావిస్తారు.. అందుకే ప్రతి పూజకు వాడుతారు.. కేవలం పూజలకు మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మ వ్యాధులను నివారించడానికి తులసిని ఉపయోగించారు.. ఇంకా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా శరీరాన్ని రక్షిస్తాయి.. తులసి పరగడుపున తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఒకసారి చూద్దాం..
ఈ తులసి నీటిని ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.. తేనెలో ముంచి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే జలుబు, తుమ్ములు, దగ్గు, గొంతునొప్పి మొదలైన వాటి నుండి ఉపశమనం పొందవచ్చు. తులసి ఆకులతో టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఒత్తిడి తగ్గుతుంది. జీర్ణ క్రియ మెరుగుపడుతుంది.. తులసి ఆకులను పసుపు పొడి వేసి మరిగించిన నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, గొంతు సమస్యలను తగ్గిస్తుంది.. ఉదర సమస్యలను తొలగించడంలో బేషుగ్గా పని చేస్తుంది..
యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. తులసిలో శరీరంలో మంటను తగ్గించే సమ్మేళనాలు ఉన్నాయి.. నోటి దుర్వాసనను తగ్గిస్తుంది.. గొంతు ఇన్ఫెక్షన్ ల ను తగ్గిస్తుంది.రోజూ ఉదయాన్నే తులసి టీ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. తులసి నీరు తాగడం వల్ల మలబద్ధకం, విరేచనాల సమస్యలు తగ్గుతాయి… ఏదైనా లిమిట్ గా తీసుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
