మహిళల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాసాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహిస్తున్న GBT (Glow Beyond Title) Season-3 కర్టెన్ రైజర్ కార్యక్రమం జూలై 12న హైదరాబాద్లోని హోటల్ దసపల్లాలో ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమంతో GBT సీజన్-3కి అధికారికంగా శ్రీకారం చుట్టనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ ఈవెంట్లో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, మోడల్స్, ఫ్యాషన్ డిజైనర్లు, బ్యూటీ ఇండస్ట్రీ నిపుణులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, వ్యాపారవేత్తలు, సామాజిక ప్రముఖులు, మీడియా ప్రతినిధులు పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
మిస్ ఇండియా ఇంటర్నేషనల్-2022 విజేత, GBT వ్యవస్థాపకురాలు సుస్మిత పాండ్యం మాట్లాడుతూ.. GBT సీజన్-3 మహిళల్లో ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే కాకుండా, వారి ప్రతిభకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. గత సీజన్లకు లభించిన ఆదరణతో ఈసారి మరింత విజయవంతంగా నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. GBT సీజన్-3కి Prikus Digital స్ట్రాటజిక్ & డిజిటల్ పార్టనర్గా వ్యవహరిస్తోంది. ఈవెంట్ బ్రాండింగ్, డిజిటల్ ప్రమోషన్స్, పబ్లిక్ రిలేషన్స్, నిర్వహణ బాధ్యతలను సంస్థ చేపట్టనుంది. ఈ సందర్భంగా Prikus CEO ప్రశాంత్ అరె, Skillvedha Innovations CTO సంతోష్ అవటపల్లి, వాసవి ఇన్నోవేషన్స్ అధినేత హరితేజ, ఫ్యాషన్ డిజైనర్ భవాని శర్మతో పాటు Prikus Digital బృందం, గత GBT సభ్యులు సుస్మిత పాండ్యంకు శుభాకాంక్షలు తెలియజేశారు.
హైదరాబాద్లో జరగనున్న ఈ కర్టెన్ రైజర్ కార్యక్రమం ద్వారా GBT సీజన్-3 అధికారికంగా ప్రారంభం కానుంది. అందం, ప్రతిభ, వ్యక్తిత్వ వికాసం, మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూ ఈ కార్యక్రమం మరో విజయవంతమైన అధ్యాయానికి నాంది పలుకుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

