Health: ఒంటరిగా భోజనం చేస్తున్నారా? అయితే, మీరు రిస్క్‌లో పడ్డట్లే.. షాకింగ్ స్టడీ..

  • ఒంటరిగా భోజనం చేస్తే మానసిక, మెదడు ఆరోగ్యంపై ఎఫెక్ట్..
  • పరిశోధకులు అధ్యయనంలో కీలక విషయాలు..
Health

Health

Health: తరుచుగా మీరు ఒంటరిగా భోజనం చేస్తున్నారా.? అయితే మీరు మానసిక, మెదడు ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నట్లే. కలిసి భోజనం చేయడం కేవలం మనుషులను దగ్గర చేసే ఒక సామాజిక అలవాటు మాత్రమే కాదు, ఇది మన మానసిక ఆరోగ్యానికి మేలు చేసే విషయమని పరిశోధకుల అధ్యయనం తేల్చింది. కుటుంబంతో కలిసి డిన్నర్ చేయడం, సహోద్యోగులతో కలిసి తినడం, స్నేహితులతో కలిసి భోజనం చేయడం వల్ల సామాజిక సంబంధాలే కాకుండా, ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.

కలిసి భోజనం చేయడం ద్వారా భావోద్వేగ ఆరోగ్యం మెరుగ్గా ఉండే అవకాశం ఉన్నట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఒంటరిగా భోజనం చేయడం ద్వారా డిప్రెషన్‌తో పాటు మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్నట్లు తేలింది. కలిసి భోజనం చేయడం ద్వారా మాట్లాడుకోవడం, పరస్పరం అనుబంధాలు పెంచుకోవడం, సంంధాలను బలోపేతం చేసుకోవడం, ఒంటరితనాన్ని తగ్గించుకోవడం వంటి అవకాశాలు లభిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.

కలిసి భోజనం చేయడవ వల్ల భావోద్వేగ ఆరోగ్యం మధ్య సంబంధం ఉన్నట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధుల్లో ఈ సంబంధం ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. తరచుగా ఇతరులతో కలిసి భోజనం చేసే వారితో పోలిస్తే ఒంటరిగా భోజనం చేసే వారిలో డిప్రెషన్ లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. వరల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.5 లక్షల మంది నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించింది. తమకు తెలిసిన వ్యక్తులతో ఎంత తరచుగా లంచ్ లేదా డిన్నర్ చేస్తారనే ప్రశ్నలను కూడా పరిశోధకులు ఇందులో పరిగణనలోకి తీసుకున్నారు.

ఒంటరిగా భోజనం చేయడం దీర్ఘకాలిక మెదడు ఆరోగ్యంతో సంబంధం కలిగి ఉందా అనే అంశాన్ని శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. జపాన్ పరిశోధకులు 2025లో నిర్వహించిన ఒక అధ్యయనంలో.. క్రమం తప్పకుండా ఒంటరిగా భోజనం చేసే వ్యక్తుల్లో మెదడులోని కొన్ని ప్రాంతాల్లో వాల్యూమ్ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా జ్ఞాపకశక్తి, కాగ్నిటివ్ ఫంక్షన్‌కు సంబంధించిన హిప్పోకాంపస్, మీడియల్ టెంపోరల్ లోబ్ వంటి ప్రాంతాల్లో ఈ తేడాలు కనిపించాయి.అయితే ఈ తేడాలకు ఆహారపు అలవాట్లు కూడా కొంతవరకు కారణం కావచ్చని పరిశోధకులు పేర్కొన్నారు.

కలిసి భోజనం చేసినప్పుడు ఆహారం మరింత ఆనందంగా అనిపించడానికి జీవశాస్త్రపరమైన కారణం కూడా ఉండవచ్చు. భోజనం చేయడం వల్ల శరీరంలోని ఎండార్ఫిన్ అనే వ్యవస్థ క్రియాశీలకం కావచ్చు. ఇది ఆనందం, సామాజిక అనుబంధంతో సంబంధం ఉన్న వ్యవస్థ. అందుకే భోజనం చేసే సమయంలో ఒంటరిగా కాకుండా స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి చేస్తే ప్రయోజనం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.