Bank Jobs: పంజాబ్ & సింధ్ బ్యాంక్లో 1000 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు.. గ్రాడ్యుయేట్స్కు బంపర్ అవకాశం
- పంజాబ్ & సింధ్ బ్యాంక్లో 1000 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు
- ఏప్రిల్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు
- తెలంగాణలో 30 పోస్టులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ & సింధ్ బ్యాంక్ లో 1000 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకానికి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు PSB అధికారిక వెబ్సైట్, punjabandsindbank.co.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. తెలంగాణలో 30 పోస్టులు భర్తీకానున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.
అభ్యర్థులు ఒక్క స్టేట్ ఖాళీకి మాత్రమే దరఖాస్తు చేయాలి. ఖాళీలు provisional (మారవచ్చు). SC/ST/OBC/EWS/PwBD రిజర్వేషన్ ఉంది.
అభ్యర్థులు ఏదైనా డిసిప్లిన్లో గ్రాడ్యుయేషన్ (గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి) పూర్తి చేసి ఉండాలి.
స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా రీజనల్ రూరల్ బ్యాంక్లో అధికారిగా కనీసం 18 నెలలు బ్రాంచ్ అనుభవం (పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనుభవం కావాలి) కలిగి ఉండాలి.
వయస్సు (01.03.2026 నాటికి). 20 నుండి 30 సంవత్సరాలు (02.03.1996 నుండి 01.03.2006 మధ్య జన్మించినవారు)
వయస్సు రిలాక్సేషన్: SC/ST – 5 సంవత్సరాలు, OBC – 3 సంవత్సరాలు, PwBD – 10 సంవత్సరాలు, ఎక్స్-సర్విస్మెన్ & ఇతరులకు నిబంధనల ప్రకారం
Also Read
- Job News: ఏడాదికి రూ.55 లక్షల భారీ ప్యాకేజీ.. నోటిఫికేషన్ ఔట్.. ఇలా అప్లై చేసుకోండి!
- TGPSC Notifications: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. రేపు మూడు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామన్న టీజీపీఎస్సీ చైర్మన్..
- Indian Navy Recruitment 2026: భారత నావికాదళంలో బీటెక్ క్యాడెట్ ఎంట్రీకి దరఖాస్తులు.. అర్హత, ఎంపిక వివరాలు ఇవే
- BSNL JTO Recruitment 2026: జాబ్ కావాలా?.. బీఎస్ఎన్ఎల్ లో జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టులు రెడీ.. అర్హతలు, పూర్తి వివరాలు
మంచి క్రెడిట్ హిస్టరీ (CIBIL స్కోర్ కనీసం 650 ఉండాలి), భారతీయ పౌరులు లేదా నెపాల్/భూటాన్ సబ్జెక్టులు. ఆన్ లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం JMGS-I.. రూ. 48,480 – 85,920 ఉంటుంది. Probation పిరియడ్ 6 నెలలు. 3 సంవత్సరాల సర్వీస్ బాండ్ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన అభ్యర్థులు రూ.850 (అదనంగా పన్నులు, పేమెంట్ గేట్వే ఛార్జీలు) చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వర్గాలకు చెందిన అభ్యర్థులు రూ.100 (అదనంగా పన్నులు మరియు పేమెంట్ గేట్వే ఛార్జీలు) చెల్లించాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Train Safety Tips: ట్రైన్లో ఫ్రీ వైఫై వాడేవారికి బిగ్ షాక్.. ఈ తప్పు చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!
-
Peddi Nizam : పెద్ది నైజాం బుకింగ్స్ ఓపెన్.. కానీ ఆ థియేటర్స్ ఇంకా పెండింగ్
-
Pandu Master: విశాఖలో రోడ్డు ప్రమాదం.. డాన్స్ మాస్టర్ పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు!
-
Obsession Collections : 7 కోట్ల బడ్జెట్ తో 1000కోట్లకు పైగా కలెక్షన్లు… బాక్సాఫీస్ లో అదరగొడుతన్న హారర్ థ్రిల్లర్
-
Prabhas : జెట్ స్పీడ్ లో స్పిరిట్ షూట్.. టీజర్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!