NTV Telugu Site icon

NTPC: ఎన్టీపీసీలో ఇంజనీరింగ్ జాబ్స్.. రాత పరీక్ష లేదు.. నెలకు 1.4 లక్షల జీతం

Ntpc

Ntpc

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. అది కూడా ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఈజీగా జాబ్ కొట్టొచ్చు. మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్నట్లైతే మీకు ఇదే మంచి ఛాన్స్. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 475 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. భర్తీ కానున్న పోస్టుల్లో ఎలక్ట్రికల్ 135, మెకానికల్ 180, ఎలక్ట్రానిక్స్/ఇన్ స్ట్రుమెంటేషన్ 85, సివిల్ 50, మైనింగ్ 25 పోస్టులున్నాయి.

ఈ ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయం నుంచి ఇంజినీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి. SC/ST/PwBD అభ్యర్థులు 55 శాతం.. ఇతరులు కనీసం 65 శాతం మార్కులు సాధించి ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా గేట్(GATE 2024) పరీక్షకు హాజరై ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST/OBC/PWD/EBC అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు అభ్యర్థులు వారి గేట్-2024 స్కోరు ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేయబడతారు.

షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. ఎంపికైన వారు నెలకు రూ.40వేల నుంచి 1.4 లక్షల వేతనం పొందుతారు. దరఖాస్తు ఫీజు జనరల్/ EWS/ ఓబీసీ అభ్యర్థులు రూ.300 చెల్లించాలి. SC/ST/PwBD/Ex Servicemen/ మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 13 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.