West Asia Crisis: పశ్చిమ ఆసియాలో మళ్లీ యుద్ధ జ్వాలలు.. ‘ఇరాన్ను భూమ్మీద లేకుండా తుడిచిపెట్టేస్తాం’.. ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Asia Crisis: పశ్చిమ ఆసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. 18 రోజుల కాల్పుల విరమణ తర్వాత ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. యూఏఈ చమురు నిలయాలపై డ్రోన్ దాడులు, బెహ్రెయిన్లో ఎమర్జెన్సీ, హోర్ముజ్ జలసంధిలో నౌకలపై దాడులతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా 6 శాతం పెరిగాయి. తాజాగా 18 రోజుల విరామం తర్వాత ఇరాన్, అమెరికా, దాని మిత్రదేశాల మధ్య మళ్లీ ఘర్షణ వాతావరణం నెలకొంది. తాజాగా జరిగిన దాడులతో గల్ఫ్ రీజియన్ అట్టుడుకుతోంది.
పౌర నౌకలపై అమెరికా దాడి? ఇరాన్ ఆరోపణ
ఇరాన్ సరిహద్దుల్లో సరకు రవాణా చేస్తున్న రెండు పౌర నౌకలపై అమెరికా సైన్యం దాడులు చేసిందని ఇరాన్ మీడియా సంచలన కథనాన్ని వెలువరించింది. ఈ ఘటనలో ఐదుగురు పౌరులు మరణించినట్లు ఇరాన్ పేర్కొంది. అయితే అమెరికా ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. తాము కేవలం వాణిజ్య నౌకలకు రక్షణగా హోర్ముజ్ జలసంధి గుండా ఆపరేషన్ నిర్వహిస్తున్నామని, ఇరాన్ చేస్తున్న దాడుల వార్తలు ‘కల్పితం’ అని అమెరికా స్పష్టం చేసింది. ఇదే సమయంలో సంయుక్త అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని ఫుజైరా చమురు కేంద్రంపై ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడింది. ఇది హోర్ముజ్ జలసంధిని బైపాస్ చేసే కీలకమైన పైప్లైన్ కేంద్రం. ఈ దాడి కారణంగా అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. దీనికి తోడు ఎమిరేట్స్ తీరంలో ఒక సరకు రవాణా నౌక కూడా తగలబడినట్లు బ్రిటీష్ సైన్యం ధృవీకరించింది.
Also Read
- Sharad Pawar: విదేశీ పర్యటనలతో దేశ ప్రతిష్టతను కాపాడుతున్నారు.. మోడీపై శరద్పవార్ ప్రశంసలు
- Modi - Meloni - Melody: జార్జియా మెలోనికి మోడీ స్పెషల్ గిఫ్ట్..! సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో
- Broiler Chicken Facts: బ్రాయిలర్ కోళ్లకు నిజంగా హార్మోన్లు ఇస్తారా..? చికెన్పై ఉన్న అపోహల వెనుక అసలు నిజం ఇదే..
- Super Mileage Car: సంచలనం సృష్టించిన విద్యార్థులు.. లీటర్ పెట్రోల్తో 911 కి.మీ. నడిచే కారు ఆవిష్కరణ.!
పరిస్థితి తీవ్రతను గమనించిన బెహ్రెయిన్ ప్రభుత్వం దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి) ప్రకటించింది. ఏ క్షణంలోనైనా దాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో రెడ్ అలర్ట్ జారీ చేసింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఇరాన్ను తీవ్రంగా హెచ్చరించారు. “హోర్ముజ్ జలసంధిలో అమెరికా నౌకలపై దాడి చేస్తే ఇరాన్ను భూమ్మీద లేకుండా తుడిచిపెట్టేస్తాం” అని హెచ్చరించారు. ఇరాన్ ఇప్పటికే దక్షిణ కొరియా నౌకపై కూడా దాడి చేసిందని ఆయన ఆరోపించారు. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఈ దాడులతో తమకు సంబంధం లేదని పేర్కొన్నారు. అమెరికా, యూఏఈలు యుద్ధం అనే ‘మొసలి గుంట’లో పడకూడదని హితవు పలికారు. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో చర్చలు జరుగుతున్నాయని, ఈ సమస్యకు సైనిక పరిష్కారం లేదని ఆయన స్పష్టం చేశారు.
హోర్ముజ్ జలసంధి మూతపడితే భారత్ వంటి దేశాలకు ఎల్పీజీ (LPG), చమురు సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంది. గ్లోబల్ ఎనర్జీ సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకుని ఈ జలసంధిని తెరిపించేందుకు అమెరికా ఇప్పుడు చైనా సహాయాన్ని కూడా కోరుతోంది. అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్, జనరల్ డాన్ కేన్ ఈ రోజు (మంగళవారం) ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు వారి ప్రకటన కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
తాజావార్తలు
-
AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
-
RC 17: చరణ్ ఫాన్స్.. రెడీ అవండమ్మా!
-
E30 Petrol: పెట్రోల్లో పెరగనున్న ఇథనాల్ శాతం.. వాహనదారులకు లాభమా? నష్టమా?
-
Drishyam 3: దృశ్యం క్రేజ్ అదృశ్యం!
-
CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!