Site icon NTV Telugu

Iran War: ఇరాన్ “పాలన మార్పు”‌పై అమెరికా ఇంటెలిజెన్స్ సంచలన నివేదిక..

Israel Iran War

Israel Iran War

Iran War: ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా విరుచుకుపడుతున్న వేళ, యూఎస్ ఇంటెలిజెన్స్ సంచలన నివేదిక విడుదలైంది. పెద్ద ఎత్తున యుద్ధం తర్వాత కూడా ఇరాన్‌లో ‘‘రెజీమ్ ఛేంజ్(పాలనమార్పు)’’ సాధ్యం కాదని చెప్పింది. ఇరాన్‌పై ‘‘ఎపిక్ ప్యూరీ’’ పేరుతో దాడులు చేస్తున్నప్పటికీ, అక్కడి ప్రభుత్వాన్ని కూలదోయడం అసాధ్యమని నేషనల్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్ (NIC) వర్గీకృత నివేదిక హెచ్చరించింది.

Read Also: Airtel 365 Days Plans: అద్భుతమైన Airtel ప్లాన్.. 365 రోజుల పాటు రోజుకు 2.5GB డేటా, ఫ్రీ Jiohotstar

ఇరాన్‌లో సుప్రీం లీడర్ వంటి అత్యున్నత నాయకుడు చనిపోయినప్పటికీ, పాలన సజావుగా సాగేందుకు స్పష్టమైన ప్రోటోకాల్ ఏర్పాటు చేసినట్లు నివేదిక పేర్కొంది. ప్రస్తుతం, ఇరాన్ లో ఉన్న ప్రతిపక్షాలు పాలనను చేజిక్కించుకునేంత బలంగా లేవని చెప్పింది. బాంబు దాడులు జరుగుతున్న ఈ సమయంలో వీధుల్లోకి ప్రజలు వచ్చి, సామూహిక తిరుగుబాటు కూడా సాధ్యం కాదని యూఎస్ అధికారులు అంచనా వేశారు. అయితే, యూఎస్ దళాలు ఇరాన్ లోకి ప్రవేశించడం, కుర్దులతో తిరుగుబాటు చేయించడం వంటి అంశాలను రిపోర్ట్ ప్రస్తావించలేదు.

వెనిజులాలో నికోలస్ మదురోను అరెస్ట్ చేసి, డెల్సీ రోడ్రిగ్జ్ కు అమెరికా పాలన అప్పగించింది. అయితే, ఇరాన్ లో సుప్రీం లీడర్‌ను చంపేసి, అమెరికా తనకు నచ్చని వ్యక్తిని నియమించడం అంత ఈజీ కాదని నివేదిక చెబుతోంది. మరోవైపు ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌లో పాలకుడిని నేనే ఖరారు చేస్తానని చెబుతున్నారు. ఖమేని కుమారుడు ముజ్తబా ఖమేనీ తదుపరి సుప్రీంలీడర్ కావడం తనకు ఇష్టం లేదని అన్నారు. దీనిపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘాలిబాఫ్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ తలరాతను ఇరాన్ ప్రజలే నిర్ణయించుకుంటారని ఆయన అన్నారు. ఎప్‌స్టీన్ గ్యాంగ్ నిర్ణయించదని ట్రంప్‌ను ఎద్దేవా చేశారు.

Exit mobile version