అమెరికా స్వాతంత్ర్యానికి 250 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అమెరికా ప్రభుత్వం ప్రత్యేక స్మారక బంగారు నాణెన్ని విడుదల చేయనుంది. అమెరికా మింట్ (US Mint) ఈ కొత్త 1 డాలర్ బంగారు నాణెం ముద్రణను ప్రారంభించింది. ఈ ప్రత్యేక నాణెంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్రం ముద్రించింది. అమెరికా స్వేచ్ఛ, దేశభక్తి, ప్రజాస్వామ్య విలువలకు ప్రతీకగా ఈ నాణెన్ని రూపొందించినట్లు అమెరికా ఆర్థికమంత్రి స్కాట్ బెసెంట్ వెల్లడించారు.
ఈ నాణెం ద్వారా అమెరికా స్వాతంత్ర్య వారసత్వాన్ని, దేశ స్థాపన స్ఫూర్తిని, స్వేచ్ఛను పరిరక్షించాలనే సంకల్పాన్ని ప్రతిబింబించే ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నారు. అలాగే అమెరికా విలువలు, జాతీయ ఐక్యత, దేశభక్తి భావాలను ఈ స్మారక నాణెం ద్వారా భావితరాలకు చేరవేయాలనే ఉద్దేశంతో దీనిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. బంగారు నాణెం ఫస్ట్లుక్ను స్కాట్ బెసెంట్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
https://x.com/SecScottBessent/status/2077339920461439115

