Thai Warship Sinks: నీట మునిగిన భారీ యుద్ధ నౌక.. 31 మంది గల్లంతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thai warship sinks in severe weather leaving 31 crew missing: సోమవారం గల్ఫ్ ఆఫ్ థాయ్లాండ్లో ఒక థాయ్ యుద్ధ నౌక (హెచ్టీఎంస్ సుఖొథాయ్) ప్రమాదవశాత్తూ నీట మునిగింది. బలమైన ఈదురుగాలుల కారణంగా.. సముద్రపు నీరు యుద్ధనౌకలోకి చేరింది. మొబైల్ పంపింగ్ మిషన్ల ద్వారా లోపలికి వచ్చిన నీటిని బయటకు పంపించేందుకు ప్రయత్నించారు. కానీ.. విద్యుత్ వ్యవస్థ దెబ్బతినడం, ఇంజిన్ కూడా పని చేయకపోవడంతో ఆ నౌకలోకి మరింత నీరు వచ్చి చేరింది. దీంతో.. ఆ నౌక ఒకవైపుకి ఒరుగుతూ, సముద్రంలో మునిగిపోయింది. ప్రమాద సమయంలో ఆ నౌకలో మొత్తం 106 మంది నేవీ సిబ్బంది ఉండగా.. 31 మంది గల్లంతయ్యారు. మరో 75 మందిని సహాయక సిబ్బంది కాపాడగలిగింది.
Lionel Messi: యూ-టర్న్ తీసుకున్న మెస్సీ.. ఫ్యాన్స్కి పండగే!
Also Read
- Trump: డెమోక్రాట్లు గెలిస్తే అమెరికాకు అదే గతి.. స్పెయిన్ వలసపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Cockroach Party: మరో దేశానికి పొంచి ఉన్న ‘కాక్రోచ్’ ముప్పు.. అవినీతిపై ఢిల్లీ తరహాలో కసరత్తు
- Iran-US: హార్ముజ్ దగ్గర మళ్లీ ఉద్రిక్తతలు.. రెండు ట్యాంకర్లపై ఇరాన్ దాడి
- Pakistan: పాక్లో తిరుగుబాటు భయం..! బొద్దింకలు ఏకమైతే అన్నీ తలకిందులే.. యువతపై హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు
థాయ్లాండ్లోని ప్రచుప్ ఖిరి ఖాన్ ప్రావిన్స్లో సముద్ర తీరానికి 20 నాటికల్ మైళ్ల దూరంలో ఈ యుద్ధ నౌక ఆదివారం సాయంత్రం విధుల్లో పాల్గొంది. అయితే.. ఇంతలోనే అక్కడి వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడంతో, ఈ నౌక ప్రమాదానికి గురైంది. ఈ సమాచారం అందుకున్న వెంటనే.. థాయ్ నౌకాదళం సంఘటనా స్థలానికి వెంటనే మూడు ఫ్రిగెట్లు, రెండు హెలికాప్టర్లను పంపించింది. ఎలాగైనా నీట మునగకుండా ఆ నౌకను కాపాడేందుకు వాళ్లు సహాయక సిబ్బంది వారు తీవ్రంగా శ్రమించారు. కానీ, బలమైన గాలుల కారణంగా అది సాధ్యపడలేదు. గల్లంతైన 31 మంది కోసం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నౌకలు, హెలికాప్టర్ల సాయంతో నావికుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే.. అక్కడ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా, సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు చెప్తున్నారు.
Fifa World Cup: వరల్డ్కప్ ఫైనల్లో ఓటమి.. ఫ్రాన్స్లో చెలరేగిన అల్లర్లు
ఈ 960 టన్నుల సుఖోథాయ్ని యునైటెడ్ స్టేట్స్లో నిర్మించి, 1987లో థాయ్ నేవీలో విధుల్లోకి తీసుకొచ్చారు. ఇది పాత నౌక కావడంతో.. ప్రమాద సమయంలో అందులోని నేవీ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారని ఓ రిటైర్డ్ యూఎస్ నేవీ కెప్టెన్ పేర్కొన్నారు. ఒక్కసారి విద్యుత్ వ్యవస్థ దెబ్బతింటే.. లోపల చీకటి కమ్ముకుంటుందని, అప్పుడు ఏం చేయడానికి వీలుండదని తెలిపారు. కాగా.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఓ థాయ్ నౌక మునిగిపోవడం, ఇదే మొదటిసారి అని అధికారులు పేర్కొంటున్నారు.
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!