Pahalgam: మోడీకి కృతజ్ఞతలు చెప్పిన సింగపూర్ మహిళ.. కారణమిదే!
- మోడీకి కృతజ్ఞతలు చెప్పిన సింగపూర్ మహిళ
- దౌత్య బృందాన్ని కలిసి భారత సంతతి మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడి నుంచి ఎందరో తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇక పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్.. ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులను హతమార్చింది. ఇక ఈ ఆపరేషన్పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత సంతతికి చెందిన సింగపూర్ మహిళ వైశాలి భట్… ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.
ఇది కూడా చదవండి: IMD Warning: పలు రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన.. ఏఏ రాష్ట్రాలంటే..!
Also Read
- Israel General Election 2026: ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికలకు తేదీ ఖరారు.. గాజా యుద్ధం నేపథ్యంలో నెతన్యాహుకు కీలక పరీక్ష
- US Iran Conflict: ఇరాన్పై అమెరికా దాడి.. సిరిక్, బందర్ అబ్బాస్లలో పేలుళ్లు.. హార్ముజ్లో వాణిజ్య నౌకలపై కాల్పులు
- Bangkok Pub Fire: అర్థరాత్రి పబ్లో మంటల బీభత్సం.. 27 మంది మృతి (వీడియో)
- Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
పాకిస్థాన్ వైఖరిని అంతర్జాతీయంగా ఎంటగట్టేందుకు భారత్ నుంచి ఆయా బృందాలు విదేశాల్లో తిరుగుతున్నారు. బీజేపీ ఎంపీ హేమాంగ్ జోషి ఆధ్వర్యంలో ఓ బృందం సింగపూర్లో పర్యటించింది. ఈ సందర్భంగా వైశాలి భట్.. దౌత్య బృందాన్ని కలిసింది. ఈ సందర్భంగా నాటి సంఘటనను గుర్తు చేసుకుంటూ ఆవేదన చెందింది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి గంటన్నర ముందు తన భర్తతో కలిసి బైసారన్ లోయ నుంచి బయలదేరినట్లు చెప్పింది. లేదంటే తన భర్త ప్రాణాలు కూడా పోయేవని వాపోయింది. అనంతరం పహల్గామ్ ఉగ్ర దాడి గురించి వార్తల్లో చూసి భయాందోళనలకు గురైనట్లు తెలిపింది. తాము తృటీలో తప్పించుకున్నామని.. వార్తలు చూశాక ఒళ్లు గగుర్పొడించిందని చెప్పుకొచ్చింది. మే7న భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టడంతో ఆనందం వేసిందన్నారు. ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన వారికి ఆపరేషన్ సిందూర్ ఒక ఊరట అని తెలిపింది. ఆపరేషన్కి సిందూర్ అని పేరు పెట్టడం సముచితంగా ఉందని ఆమె తెలిపింది. ఆపరేషన్ సిందూర్ చేపట్టిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు చెప్పారు.
ఇది కూడా చదవండి: Urine: మీ మూత్రం నుంచి నురగ, దుర్వాసన వస్తుందా? ఇన్ఫెక్షన్ కారకం…!
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థాన్కు సింధు జలాలు నిలిపేసింది. పాక్ వీసాలను రద్దు చేసింది. అటారీ సరిహద్దు నిలిపేసింది. అనంతరం మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక పాకిస్థాన్ వైమానిక స్థావరాలు నాశనం అయ్యాయి.
- Tags
తాజావార్తలు
-
Indian Railways Viral Train Puja: కదులుతున్న రైలులో పూజలు?.. రైల్వే శాఖ క్లారిటీ..
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Akshay Kumar: ఆ హీరోయిన్ నా మొదటి క్రష్.. క్లైమాక్స్ లేకుండానే సినిమా.. అక్షయ్ షాకింగ్ రివీల్
-
Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు.. రూ.152.95 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన!
-
South Indian Women-Led Films : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన లేడి ఓరియేంటేడ్ సౌత్ మూవీస్
ట్రెండింగ్
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?