Pahalgam: మోడీకి కృతజ్ఞతలు చెప్పిన సింగపూర్ మహిళ.. కారణమిదే!
- మోడీకి కృతజ్ఞతలు చెప్పిన సింగపూర్ మహిళ
- దౌత్య బృందాన్ని కలిసి భారత సంతతి మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడి నుంచి ఎందరో తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇక పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్.. ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులను హతమార్చింది. ఇక ఈ ఆపరేషన్పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత సంతతికి చెందిన సింగపూర్ మహిళ వైశాలి భట్… ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.
ఇది కూడా చదవండి: IMD Warning: పలు రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన.. ఏఏ రాష్ట్రాలంటే..!
Also Read
- Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్లో పాల్గొననున్న జిన్పింగ్
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
- Makkah: ఉద్రిక్తతల వేళ మక్కా ఒప్పందంలోకి ఇరాన్కు ఆహ్వానం! ఏదో జరుగుతోంది!
- Iran-US Tensions Escalate: అమెరికా ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే ‘యుద్ధ చర్య’గానే చూస్తాం.. దేశాలకు ఇరాన్ హెచ్చరిక
పాకిస్థాన్ వైఖరిని అంతర్జాతీయంగా ఎంటగట్టేందుకు భారత్ నుంచి ఆయా బృందాలు విదేశాల్లో తిరుగుతున్నారు. బీజేపీ ఎంపీ హేమాంగ్ జోషి ఆధ్వర్యంలో ఓ బృందం సింగపూర్లో పర్యటించింది. ఈ సందర్భంగా వైశాలి భట్.. దౌత్య బృందాన్ని కలిసింది. ఈ సందర్భంగా నాటి సంఘటనను గుర్తు చేసుకుంటూ ఆవేదన చెందింది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి గంటన్నర ముందు తన భర్తతో కలిసి బైసారన్ లోయ నుంచి బయలదేరినట్లు చెప్పింది. లేదంటే తన భర్త ప్రాణాలు కూడా పోయేవని వాపోయింది. అనంతరం పహల్గామ్ ఉగ్ర దాడి గురించి వార్తల్లో చూసి భయాందోళనలకు గురైనట్లు తెలిపింది. తాము తృటీలో తప్పించుకున్నామని.. వార్తలు చూశాక ఒళ్లు గగుర్పొడించిందని చెప్పుకొచ్చింది. మే7న భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టడంతో ఆనందం వేసిందన్నారు. ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన వారికి ఆపరేషన్ సిందూర్ ఒక ఊరట అని తెలిపింది. ఆపరేషన్కి సిందూర్ అని పేరు పెట్టడం సముచితంగా ఉందని ఆమె తెలిపింది. ఆపరేషన్ సిందూర్ చేపట్టిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు చెప్పారు.
ఇది కూడా చదవండి: Urine: మీ మూత్రం నుంచి నురగ, దుర్వాసన వస్తుందా? ఇన్ఫెక్షన్ కారకం…!
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థాన్కు సింధు జలాలు నిలిపేసింది. పాక్ వీసాలను రద్దు చేసింది. అటారీ సరిహద్దు నిలిపేసింది. అనంతరం మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక పాకిస్థాన్ వైమానిక స్థావరాలు నాశనం అయ్యాయి.
- Tags
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!